Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:34 PM

నకిలీ గుళికలతో నష్టపోయిన కక్కిరేణి రైతులను ఆదుకోవాలి

నకిలీ గుళికలతో నష్టపోయిన కక్కిరేణి రైతులను ఆదుకోవాలి

నకిలీ గుళికలతో నష్టపోయిన కక్కిరేణి రైతులను ఆదుకోవాలి
December 24, 2025 07:37 PM 1,429 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎకరానికి రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి

జిల్లా వ్యవసాయ అధికారికి వినతి.. న్యాయం చేస్తామని హామీ

(రామన్నపేట/కక్కిరేణి, స్థానికం న్యూస్):

నకిలీ గుళికల కారణంగా పంట నష్టపోయిన కక్కిరేణి రైతులను ఆదుకోవాలని, వారికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బాధిత రైతులతో కలిసి ఆయన జిల్లా వ్యవసాయ అధికారి (DAO) పి.వి. రమణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

అసలేం జరిగింది?

ఈ సందర్భంగా మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో సుమారు 30 మంది రైతులు 'క్లోమాట 10జి' (Clomata 10G) గుళికలను కొనుగోలు చేశారు. దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో వేసిన నారు మడులకు, నాట్లు వేసిన పొలాలకు ఈ గుళికలు చల్లగా.. నారు పూర్తిగా మాడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో, దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు.

కంపెనీ తప్పిదాన్ని ఒప్పుకుంది: సంబంధిత కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు జరిపి, లోపం తమ గుళికల్లోనే ఉందని నిర్ధారించుకుని, తప్పును అంగీకరించారని అశోక్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రధాన డిమాండ్లు:

నకిలీ గుళికల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25,000 చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలి.

సదరు కంపెనీపై సమగ్ర విచారణ జరిపి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి.

పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు గన్నేబోయిన విజయభాస్కర్, బోయిని ఆనంద్, మాజీ సర్పంచ్ పిట్ట కృష్ణారెడ్డి, ముక్కామల రవి, సామాజిక కార్యకర్త వేముల సైదులు, కన్నెబోయిన వెంకటేశ్వర్లు, బుర్ర సైదులు, నాగేష్, గుండాల మల్లేష్, గుండెపూరి శ్రీను, సోమన బోయిన రామచంద్రం, బెక్కంఠి సత్తయ్య, కొన్నె రాజు, వేముల దుర్గయ్య, శ్రీను, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News