PRINT TIME: April 11, 2026 01:02 PM
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఫౌండేషన్
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జీఎంఆర్ ఫౌండేషన్
January 02, 2026 08:38 PM
24 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నిత్యం నిరుపేదలకు సేవలందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. నాగల్గిద్ది మండల పరిధిలోని శేరి ధమార్గీద్ద గ్రామానికి చెందిన జానే యోహన్, సుజాత మృతి చెందడంతో వారి పిల్లలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించి ఫౌండేషన్ ద్వారా నెలకు సరిపడా నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు సూర్య ప్రకాష్ రెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు పార్టీ నాయకుడు తుకారాం, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, శ్రీకాంత్, లాలప్ప, ఆశీర్వాదం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి