Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:26 AM

నాగిరెడ్డిగూడెం గ్రామంలో మంచి నీళ్లు లేక అవస్థలు పడుతున్న ప్రజలు

నాగిరెడ్డిగూడెం గ్రామంలో మంచి నీళ్లు లేక అవస్థలు పడుతున్న ప్రజలు

నాగిరెడ్డిగూడెం గ్రామంలో మంచి నీళ్లు లేక అవస్థలు పడుతున్న ప్రజలు
January 19, 2026 08:28 PM 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY


చింతలపూడి జనవరి 19(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని నాగిరెడ్డి గూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా మంచినీటి ఎద్దడి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని త్రాగడానికి, అవసరాలకు వాడుకోవటానికి కూడ నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఒకే మోటార్ తో నీరు సరిపోవడం లేదని మూడు రోజులైనా నీరు రాక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ప్రస్తుతమే ఈ పరిస్థితి నెలకొంటే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని అన్నారు. ఎత్తులో ఉండటం వల్ల పల్లం లోకి నీళ్లు వెళుతున్నాయని ఆ నీటిని మోటార్లు పెట్టి ఇళ్లలోకి ర ప్పించుకుంటున్నారని తెలిపారు. 30 ఇళ్ళకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని ప్రస్తుతం ఒక మోటార్ తో నీళ్లు పంపిస్తున్నారని కానీ ఒక మోటార్ నీళ్ళు సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.క్రొత్త లైన్ వేసి గేటు వాలు బిగిస్తే నీరందుతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన సమస్య పరిష్కరించడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News