Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:58 PM

నాగిరెడ్డిగూడెం గ్రామంలో మంచి నీళ్లు లేక అవస్థలు పడుతున్న ప్రజలు

నాగిరెడ్డిగూడెం గ్రామంలో మంచి నీళ్లు లేక అవస్థలు పడుతున్న ప్రజలు

నాగిరెడ్డిగూడెం గ్రామంలో మంచి నీళ్లు లేక అవస్థలు పడుతున్న ప్రజలు
January 19, 2026 08:28 PM 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY


చింతలపూడి జనవరి 19(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని నాగిరెడ్డి గూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా మంచినీటి ఎద్దడి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని త్రాగడానికి, అవసరాలకు వాడుకోవటానికి కూడ నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఒకే మోటార్ తో నీరు సరిపోవడం లేదని మూడు రోజులైనా నీరు రాక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ప్రస్తుతమే ఈ పరిస్థితి నెలకొంటే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని అన్నారు. ఎత్తులో ఉండటం వల్ల పల్లం లోకి నీళ్లు వెళుతున్నాయని ఆ నీటిని మోటార్లు పెట్టి ఇళ్లలోకి ర ప్పించుకుంటున్నారని తెలిపారు. 30 ఇళ్ళకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని ప్రస్తుతం ఒక మోటార్ తో నీళ్లు పంపిస్తున్నారని కానీ ఒక మోటార్ నీళ్ళు సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.క్రొత్త లైన్ వేసి గేటు వాలు బిగిస్తే నీరందుతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన సమస్య పరిష్కరించడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News