నాగిరెడ్డిగూడెం గ్రామంలో మంచి నీళ్లు లేక అవస్థలు పడుతున్న ప్రజలు
నాగిరెడ్డిగూడెం గ్రామంలో మంచి నీళ్లు లేక అవస్థలు పడుతున్న ప్రజలు
GADDAM JAGANMOHAN REDDY
చింతలపూడి జనవరి 19(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని నాగిరెడ్డి గూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా మంచినీటి ఎద్దడి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని త్రాగడానికి, అవసరాలకు వాడుకోవటానికి కూడ నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఒకే మోటార్ తో నీరు సరిపోవడం లేదని మూడు రోజులైనా నీరు రాక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ప్రస్తుతమే ఈ పరిస్థితి నెలకొంటే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని అన్నారు. ఎత్తులో ఉండటం వల్ల పల్లం లోకి నీళ్లు వెళుతున్నాయని ఆ నీటిని మోటార్లు పెట్టి ఇళ్లలోకి ర ప్పించుకుంటున్నారని తెలిపారు. 30 ఇళ్ళకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని ప్రస్తుతం ఒక మోటార్ తో నీళ్లు పంపిస్తున్నారని కానీ ఒక మోటార్ నీళ్ళు సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.క్రొత్త లైన్ వేసి గేటు వాలు బిగిస్తే నీరందుతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన సమస్య పరిష్కరించడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి