Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:48 PM

నాగర్ కర్నూల్ కూమ్మెర ఘటనపై యాదాద్రిలో ఆగ్రహం

నాగర్ కర్నూల్ కూమ్మెర ఘటనపై యాదాద్రిలో ఆగ్రహం

నాగర్ కర్నూల్ కూమ్మెర ఘటనపై యాదాద్రిలో ఆగ్రహం
February 24, 2026 07:08 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రజక కుటుంబంపై దాడి ఘటనను ఖండిస్తూ..రజక సంఘాల ఆధ్వర్యంలో రైతు బజార్ వద్ద ధర్నా

భువనగిరి టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద నాగర్ కర్నూల్ జిల్లా కూమ్మెర గ్రామంలో రజక కుటుంబంపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ వివిధ బీసీ,రజక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కూమ్మెర గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శనానికి వచ్చిన రజక కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని నిరసిస్తూ..ఈ కార్యక్రమం జరిగింది.దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని,బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ ఘటనలో కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.దోషులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘాల మహిళా అధ్యక్షురాలు రత్నపురం పద్మ,జిల్లా రజక సంఘం అధ్యక్షులు జూపల్లి నాగేష్,జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శివకుమార్,బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి నరసింహ స్వామి,మండల అధ్యక్షులు జిన్నా మల్లేష్,నియోజకవర్గ బీసీ అధ్యక్షులు సాబన్ కార్ వెంకటేష్,సామాజికవేత్త కొడారి వెంకటేష్,రజక సంఘం నాయకులు రత్నపురం బలరాం,మర్రిపల్లి శ్రీనివాస్,మర్రికుక్కుల శ్రీనివాస్,రత్నపురం శేఖర్,సిరికొండ ఉపేందర్,ముదిగొండ వెంకటేష్,జూపల్లి నరసింహ,నాయిని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News