నాగల్గిద్దలో ఆధ్యాత్మిక వైభవం – శేఖర్ మహారాజు ఆశీస్సులు పొందిన గుర్రపు మచ్చేందర్
నాగల్గిద్దలో ఆధ్యాత్మిక వైభవం – శేఖర్ మహారాజు ఆశీస్సులు పొందిన గుర్రపు మచ్చేందర్
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్గిద్ద మండలం కుభతండలోని శ్రీ సంత్ సేవలాల్ మరియు భవాని మాత ఆలయంలో భక్తి శ్రద్ధలతో అద్భుతంగా నిర్వహించిన పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకకు పూజ్య శేఖర్ మహారాజు విచ్చేసి ఆశీర్వచనాలు అందించారు.ఈ సందర్భంగా జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ మహారాజును భక్తిపూర్వకంగా దర్శించుకొని ఆశీస్సులు స్వీకరించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆలయ దేవతలను ప్రార్థించారు. ప్రాంత అభివృద్ధి, ప్రజల సౌఖ్యం, సమాజ శ్రేయస్సు కోసం మహారాజు ఆశీర్వాదాలు పొందడం విశేషంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ విజయ్, కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, గణపతి మహారాజ్, మారుతి మహారాజ్, మెగానాయక్ తండ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పర్లాల్, యువకులు వాసు నాయక్, సుధాకర్, బాధ్య నాయక్, గాంధీ నాయక్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.భక్తుల హర్షధ్వానాల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుక అందరికీ ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి