రామన్నపేట స్థానిక ప్రతినిధి
రామన్నపేట మండల కేంద్రంలోని మౌలాలి చిల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. జనవరి 06 నుండి 08 వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు దర్గా ముతవాలి ముజావర్ ఎండీ జానీ పాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉత్సవాల్లో భాగంగా నేడు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు ఎండీ జానీ పాషా నివాసం నుంచి గంధం ఊరేగింపు జరుగుతుందని తెలిపారు. 07న ప్రధాన ఉర్సు ఉత్సవం, 08న దీపారాధన కార్యక్రమాలతో ఉర్సు ఉత్సవాలు ముగియనున్నాయని వివరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సవాలను విజయవంతం చేసి, దైవ ఆశీర్వాదం పొందాలని ముతవాలి కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి