Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:17 PM

"నడిగూడెం గడ్డ.. అభివృద్ధికి అడ్డా కావాలి"

"నడిగూడెం గడ్డ.. అభివృద్ధికి అడ్డా కావాలి"

"నడిగూడెం గడ్డ.. అభివృద్ధికి అడ్డా కావాలి"
February 03, 2026 03:38 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

"నడిగూడెం గడ్డ.. అభివృద్ధికి అడ్డా కావాలి"


"అక్షరానికి అండగా.. అభివృద్ధికి తోడుగా.. నిరంతరం ప్రజల కోసమే మీ అడుగులు పడాలి" నినాదంతో నడిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ దున్న శ్రీనివాస్ ని మాదాసు వీరబాబు మరియు మిత్రబృందం మర్యాదపూర్వకంగా కలిశారు.పూల బుకేలు అందజేసి, శాలువాతో సత్కరించిన ఈ వేడుక కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాదు, ఒక గొప్ప సంకల్పానికి వేదికగా నిలిచింది కలం యోధుడికి కష్టం వస్తే.. కొండంత అండగా నిలవాలి! జనాల కన్నీళ్లు తుడిచేందుకు.. అహర్నిశలు శ్రమించాలి అభివృద్ధి అంటే మాటలు కాదు.. అది నడిగూడెం ప్రజల ముఖాల్లో కనిపించే చిరునవ్వు కావాలి."

పదవి బాధ్యత అయితే.. సేవ పరమార్ధం కావాలి!"

ఈ ఆత్మీయ పలకరింపులో మాదాసు వీరబాబు మాట్లాడుతూ, సమాజానికి వెన్నెముక వంటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో దున్న శ్రీనివాస్ సర్పంచ్ గా ఒక భరోసాగా నిలవాలని ప్రజల అభివృద్ధి బాటకై ముందడుగు వేయాలని ప్రతినిత్యం ప్రజా సేవ మాదాసు వీరబాబు కోరారు. "ప్రజా సమస్యలను ఎత్తిచూపే విలేకరులకు ఏ కష్టం వచ్చినా మీరు ముందుండాలి. అదే విధంగా నడిగూడెం మండలాన్ని ప్రగతి పథంలో నడిపించి ప్రతి పేదవాని కష్టం తీర్చాలి" అని ఆకాంక్షించారు.

దీనికి సర్పంచ్ దున్న శ్రీనివాస్ స్పందిస్తూ.. "జర్నలిస్టుల సంక్షేమం నా బాధ్యత, ప్రజా సేవ నా ధర్మం. నడిగూడెం అభివృద్ధి కోసం నా ప్రాణం ఉన్నంత వరకు శ్రమిస్తాను" అని భావోద్వేగంతో హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాదాసు వీరబాబు మిత్రబృందం స్థానిక నాయకులు మరియు మిత్ర బృందం విలేకరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు."

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News