Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:43 PM

నేడు భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

నేడు భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

నేడు భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
December 28, 2025 03:50 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఈరోజు నుండి 24 గంటలు ఆలయ దర్శనం


స్థానికం ప్రతినిది జెర్రిపోతుల బిక్షం


రాజన్న జిల్లా డిసెంబర్28

వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుండి పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేములవాడకు భారీగా తరలివచ్చారు. భక్తులు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని, ధర్మ గుండంలో పవిత్ర స్నానా లను ఆచరిస్తున్నారు.


రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు కోడెమొక్కు క్యూలైన్‌లో సుమారుగా 3 గంటలపాటు నిరీక్షించినట్లు భక్తులు తెలిపారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్‌లో భక్తులు గంటల తరబడి వేచి ఉండి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించు కుంటున్నారు భక్తులు. ఈ నేపథ్యంలోనే మేడారం సమ్మక్క,సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ ఉంది. ఈ క్రమంలోనే శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు ఈరోజు ఉదయం పెద్ద సంఖ్యలో తరలి వస్తుండగా... ఈరోజు నుండి ఆలయం 24 గంటల పాటు తెరిచి ఉంచనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. వచ్చే సంవత్సరం జనవరి 4,11, 18,తేదీల్లో సైతం 24 గంటలు తెరవనున్నామని పేర్కొన్నారు. భీమన్న ఆలయానికి సమీపంలో ఉన్న బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనాన్ని కూడా రేపు సోమవారం 24 గంటల పాటు దర్శనం కల్పించనున్నట్లు ఈవో రమాదేవి,వివరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News