Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:39 PM

నేడు భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

నేడు భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

నేడు భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
December 28, 2025 03:50 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఈరోజు నుండి 24 గంటలు ఆలయ దర్శనం


స్థానికం ప్రతినిది జెర్రిపోతుల బిక్షం


రాజన్న జిల్లా డిసెంబర్28

వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుండి పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేములవాడకు భారీగా తరలివచ్చారు. భక్తులు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని, ధర్మ గుండంలో పవిత్ర స్నానా లను ఆచరిస్తున్నారు.


రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు కోడెమొక్కు క్యూలైన్‌లో సుమారుగా 3 గంటలపాటు నిరీక్షించినట్లు భక్తులు తెలిపారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్‌లో భక్తులు గంటల తరబడి వేచి ఉండి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించు కుంటున్నారు భక్తులు. ఈ నేపథ్యంలోనే మేడారం సమ్మక్క,సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ ఉంది. ఈ క్రమంలోనే శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు ఈరోజు ఉదయం పెద్ద సంఖ్యలో తరలి వస్తుండగా... ఈరోజు నుండి ఆలయం 24 గంటల పాటు తెరిచి ఉంచనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. వచ్చే సంవత్సరం జనవరి 4,11, 18,తేదీల్లో సైతం 24 గంటలు తెరవనున్నామని పేర్కొన్నారు. భీమన్న ఆలయానికి సమీపంలో ఉన్న బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనాన్ని కూడా రేపు సోమవారం 24 గంటల పాటు దర్శనం కల్పించనున్నట్లు ఈవో రమాదేవి,వివరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News