నాంచారి పేటలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ
నాంచారి పేటలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ
Sthanikam District Staff Reporter
స్థానికం:మోటకొండూరు ప్రతినిధి
మోటకొండూరు మండల పరిధిలోని నాంచారి పేట గ్రామంలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్లు గ్రామ సర్పంచ్ బెల్లి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన వారు పీసరి ఉమా-శ్రీకాంత్ రెడ్డి ప్రథమ బహుమతి బచ్చె శ్రీను టీంకి 5500/-అందా చేశారు. రెండోవ బహుమతి ముస్కు స్వాతి-వికాస్ రెడ్డి 3500/- గంధమల్ల గణేష్ టీంకి మరియు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి కంది శ్వేత-అనిల్ కుమార్ రెడ్డి గంధమల్ల లింగస్వామికి 1000/-తో పాటు గెలిచిన ప్రతి ఒక్కరికి షీల్డ్ అందజేశారు. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న యువత మాట్లాడుతూ గ్రామంలో టోర్నమెంట్లు నిర్వహించడం సంతోషంగా ఉందని యువత ఆటలలో చురుకుగా పాల్గొనడం వల్ల మానసిక ఉత్తేజం తో పాటు శారీరక వ్యాయామం కూడా తోడు అవుతుందని ఈ విధంగా యువతను చైతన్య పరుస్తున్నందుకు ముందు ముందు కూడా ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరారు. బహుమతి ప్రధానం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంధ మల్ల రేణుక వార్డ్ సభ్యులు యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి