Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:58 AM

నారాయణఖేడ్‌లో రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

నారాయణఖేడ్‌లో రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

నారాయణఖేడ్‌లో రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం
08-01-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలో ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు రాజీవ్ చౌక్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం పాల్గొని వాహనదారులకు రోడ్డు భద్రతపై ముఖ్యమైన సూచనలు చేశారు. హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించిన తర్వాత వాహనం నడపరాదని స్పష్టంగా అవగాహన కల్పించారు.రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించిన వాహనదారులను శాలువాలతో సత్కరించి ప్రోత్సహించారు. ప్రజల్లో భద్రతా నిబంధనలపై అవగాహన పెంచి, భవిష్యత్తులో ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Sthanikam

నారాయణఖేడ్‌లో రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలో ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు రాజీవ్ చౌక్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం పాల్గొని వాహనదారులకు రోడ్డు భద్రతపై ముఖ్యమైన సూచనలు చేశారు. హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించిన తర్వాత వాహనం నడపరాదని స్పష్టంగా అవగాహన కల్పించారు.రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించిన వాహనదారులను శాలువాలతో సత్కరించి ప్రోత్సహించారు. ప్రజల్లో భద్రతా నిబంధనలపై అవగాహన పెంచి, భవిష్యత్తులో ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News