నారాయణఖేడ్లో రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం
నారాయణఖేడ్లో రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలో ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు రాజీవ్ చౌక్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం పాల్గొని వాహనదారులకు రోడ్డు భద్రతపై ముఖ్యమైన సూచనలు చేశారు. హెల్మెట్ ధరించడం, సీట్బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించిన తర్వాత వాహనం నడపరాదని స్పష్టంగా అవగాహన కల్పించారు.రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించిన వాహనదారులను శాలువాలతో సత్కరించి ప్రోత్సహించారు. ప్రజల్లో భద్రతా నిబంధనలపై అవగాహన పెంచి, భవిష్యత్తులో ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి