Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:43 AM

నారాయణఖేడ్ అక్షిత ప్రతినిధి: డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవా

నారాయణఖేడ్ అక్షిత ప్రతినిధి: డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవా

నారాయణఖేడ్ అక్షిత ప్రతినిధి: డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవా
December 18, 2025 05:13 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk


కుటుంబ, ఆస్తి వివాదాలకు శాంతియుత పరిష్కారం సాధ్యం

జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ పిలుపు

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:

డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు. క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్‌అదాలత్ మంచి అవకాశమని, రాజీ కుదుర్చుకునే వీలున్న అన్ని కేసుల్లో కక్షిదారులు ముందుకు రావాలని సూచించారు.

అనవసర గొడవలకు వెళ్లి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోవద్దని, రాజీ ద్వారా ఇరు వర్గాలు గెలిచినట్లే అవుతుందని ఎస్పీ అన్నారు. ఈ నెల 21 ఆదివారం నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా ప్రజలు సహకరించాలని కోరారు.

ఎస్‌హెచ్‌వోలు, కోర్టు డ్యూటీ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ, వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి రాజీకి అనుకూలమైన కేసుల్లో ఇరు వర్గాల సమ్మతితో పరిష్కారం సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు కోల్పోయిన డబ్బులు త్వరితగతిన తిరిగి అందేలా చూడాలని, రూ.25 వేలలోపు నష్టం జరిగిన కేసుల్లో లోక్‌అదాలత్ ద్వారా ఫిర్యాదు తీసుకుని ఎఫ్‌ఐఆర్ లేకుండానే రీఫండ్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

జిల్లాలో జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్ విజయవంతం కావడానికి అధికారులు నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాజీ పడదగిన అన్ని కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News