నారాయణఖేడ్ అక్షిత ప్రతినిధి: డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవా
నారాయణఖేడ్ అక్షిత ప్రతినిధి: డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవా
స్థానికం బృందం
కుటుంబ, ఆస్తి వివాదాలకు శాంతియుత పరిష్కారం సాధ్యం
జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ పిలుపు
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:
డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు. క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్అదాలత్ మంచి అవకాశమని, రాజీ కుదుర్చుకునే వీలున్న అన్ని కేసుల్లో కక్షిదారులు ముందుకు రావాలని సూచించారు.
అనవసర గొడవలకు వెళ్లి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోవద్దని, రాజీ ద్వారా ఇరు వర్గాలు గెలిచినట్లే అవుతుందని ఎస్పీ అన్నారు. ఈ నెల 21 ఆదివారం నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా ప్రజలు సహకరించాలని కోరారు.
ఎస్హెచ్వోలు, కోర్టు డ్యూటీ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ, వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి రాజీకి అనుకూలమైన కేసుల్లో ఇరు వర్గాల సమ్మతితో పరిష్కారం సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు కోల్పోయిన డబ్బులు త్వరితగతిన తిరిగి అందేలా చూడాలని, రూ.25 వేలలోపు నష్టం జరిగిన కేసుల్లో లోక్అదాలత్ ద్వారా ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ లేకుండానే రీఫండ్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో జరగనున్న జాతీయ మెగా లోక్అదాలత్ విజయవంతం కావడానికి అధికారులు నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాజీ పడదగిన అన్ని కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి