Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:40 PM

నారాయణఖేడ్ అక్షిత ప్రతినిధి: డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవా

నారాయణఖేడ్ అక్షిత ప్రతినిధి: డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవా

నారాయణఖేడ్ అక్షిత ప్రతినిధి: డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవా
December 18, 2025 05:13 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk


కుటుంబ, ఆస్తి వివాదాలకు శాంతియుత పరిష్కారం సాధ్యం

జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ పిలుపు

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:

డిసెంబర్ 21న జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు. క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్‌అదాలత్ మంచి అవకాశమని, రాజీ కుదుర్చుకునే వీలున్న అన్ని కేసుల్లో కక్షిదారులు ముందుకు రావాలని సూచించారు.

అనవసర గొడవలకు వెళ్లి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోవద్దని, రాజీ ద్వారా ఇరు వర్గాలు గెలిచినట్లే అవుతుందని ఎస్పీ అన్నారు. ఈ నెల 21 ఆదివారం నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా ప్రజలు సహకరించాలని కోరారు.

ఎస్‌హెచ్‌వోలు, కోర్టు డ్యూటీ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ, వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి రాజీకి అనుకూలమైన కేసుల్లో ఇరు వర్గాల సమ్మతితో పరిష్కారం సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు కోల్పోయిన డబ్బులు త్వరితగతిన తిరిగి అందేలా చూడాలని, రూ.25 వేలలోపు నష్టం జరిగిన కేసుల్లో లోక్‌అదాలత్ ద్వారా ఫిర్యాదు తీసుకుని ఎఫ్‌ఐఆర్ లేకుండానే రీఫండ్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

జిల్లాలో జరగనున్న జాతీయ మెగా లోక్‌అదాలత్ విజయవంతం కావడానికి అధికారులు నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాజీ పడదగిన అన్ని కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News