Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:30 PM

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం
December 22, 2025 05:43 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండలో గణిత దినోత్సవ వేడుకలు… రామానుజన్ సేవలపై ప్రసంగాలు

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ, రామానుజన్ జీవితం, ఆయన గణిత రంగానికి అందించిన అపూర్వమైన సేవలను ఉదాహరణలతో సహా ఆసక్తికరంగా వివరించారు. అధికారిక విద్య పరిమితంగా ఉన్నప్పటికీ, స్వయంకృషితో గణితంలో అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తిగా రామానుజన్ నిలిచారని చెప్పారు. చిన్న వయసులోనే గణితంపై అపారమైన ఆసక్తితో క్లిష్టమైన సూత్రాలను స్వయంగా ఆవిష్కరించారని తెలిపారు.

అలాగే ఆయన ప్రతిభను గుర్తించిన బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త జి. హెచ్. హార్డీ సహకారంతో ఇంగ్లాండ్‌లో పరిశోధనలు కొనసాగించి, నంబర్ థియరీ, ఇన్‌ఫినిట్ సిరీస్, మ్యాథమెటికల్ ఫార్ములాస్ వంటి రంగాల్లో గణనీయమైన కృషి చేశారని పేర్కొన్నారు. తక్కువ వయసులోనే మరణించినప్పటికీ, ఆయన చేసిన సేవలు గణిత ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోయాయని అన్నారు. డిసెంబర్ 22న ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ, రామానుజన్ అసాధారణ ప్రతిభ విద్యార్థులకు ఎప్పటికీ ప్రేరణనిచ్చేదిగా ఉంటుందని అన్నారు. కష్టపడి చదివితే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందవచ్చన్న సందేశాన్ని ఆయన జీవితం అందిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు వివిధ గణిత పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మ్యాథమెటిక్స్ విభాగానికి చెందిన లెక్చరర్లు డాక్టర్ డి. మధుకర్, కే. కనకయ్య, పార్వతి, శోభ, బాల కార్తిక్, మతిన్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News