ముసునూరు మండలంలో రాత్రి వేళ దొంగల హడావిడి
ముసునూరు మండలంలో రాత్రి వేళ దొంగల హడావిడి
GADDAM JAGANMOHAN REDDY
ముసునూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల దొంగతనాలు పెరుగుతుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చెక్కపల్లి గ్రామానికి చెందిన మామిడి శెట్టి సత్యనారాయణకు చెందిన జేసీబీ యంత్రంలో దొంగతనం చోటుచేసుకుంది.
సత్యనారాయణకు చెందిన జేసీబీని డ్రైవర్ సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో సొంత పొలంలో పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు పని ఉండడంతో వెళ్లి చూడగా జేసీబీ డోర్ తెరిచి ఉండటాన్ని గమనించి ఆశ్చర్యానికి గురయ్యాడు. పరిశీలించగా స్పీడోమీటర్ బోర్డు, స్విచ్లు, తాళం కిట్, టేపురికార్డు బాక్సులు, రెంచీలు వంటి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసి తీసుకెళ్లినట్లు తెలిసింది.
దొంగిలించిన వస్తువుల విలువ సుమారు రూ.30 వేల వరకు ఉంటుందని యజమాని తెలిపారు. ఇది సాధారణ దొంగతనమా లేక శత్రుత్వంతో చేసిన పనినా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే గ్రామాల్లో రాత్రి వేళ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి