Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

ముసునూరు మండలంలో రాత్రి వేళ దొంగల హడావిడి

ముసునూరు మండలంలో రాత్రి వేళ దొంగల హడావిడి

ముసునూరు మండలంలో రాత్రి వేళ దొంగల హడావిడి
March 09, 2026 06:26 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముసునూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల దొంగతనాలు పెరుగుతుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చెక్కపల్లి గ్రామానికి చెందిన మామిడి శెట్టి సత్యనారాయణకు చెందిన జేసీబీ యంత్రంలో దొంగతనం చోటుచేసుకుంది.

సత్యనారాయణకు చెందిన జేసీబీని డ్రైవర్ సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో సొంత పొలంలో పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు పని ఉండడంతో వెళ్లి చూడగా జేసీబీ డోర్ తెరిచి ఉండటాన్ని గమనించి ఆశ్చర్యానికి గురయ్యాడు. పరిశీలించగా స్పీడోమీటర్ బోర్డు, స్విచ్‌లు, తాళం కిట్, టేపురికార్డు బాక్సులు, రెంచీలు వంటి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసి తీసుకెళ్లినట్లు తెలిసింది.

దొంగిలించిన వస్తువుల విలువ సుమారు రూ.30 వేల వరకు ఉంటుందని యజమాని తెలిపారు. ఇది సాధారణ దొంగతనమా లేక శత్రుత్వంతో చేసిన పనినా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే గ్రామాల్లో రాత్రి వేళ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News