Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 09:40 PM

ముసునూరు మండలంలో రాత్రి వేళ దొంగల హడావిడి

ముసునూరు మండలంలో రాత్రి వేళ దొంగల హడావిడి

ముసునూరు మండలంలో రాత్రి వేళ దొంగల హడావిడి
March 09, 2026 06:26 PM 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముసునూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల దొంగతనాలు పెరుగుతుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చెక్కపల్లి గ్రామానికి చెందిన మామిడి శెట్టి సత్యనారాయణకు చెందిన జేసీబీ యంత్రంలో దొంగతనం చోటుచేసుకుంది.

సత్యనారాయణకు చెందిన జేసీబీని డ్రైవర్ సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో సొంత పొలంలో పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు పని ఉండడంతో వెళ్లి చూడగా జేసీబీ డోర్ తెరిచి ఉండటాన్ని గమనించి ఆశ్చర్యానికి గురయ్యాడు. పరిశీలించగా స్పీడోమీటర్ బోర్డు, స్విచ్‌లు, తాళం కిట్, టేపురికార్డు బాక్సులు, రెంచీలు వంటి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసి తీసుకెళ్లినట్లు తెలిసింది.

దొంగిలించిన వస్తువుల విలువ సుమారు రూ.30 వేల వరకు ఉంటుందని యజమాని తెలిపారు. ఇది సాధారణ దొంగతనమా లేక శత్రుత్వంతో చేసిన పనినా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే గ్రామాల్లో రాత్రి వేళ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News