Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 10:06 PM

ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కాలేజీలో మల్టీపర్పస్ బిల్డింగ్ శంకుస్థాపన

ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కాలేజీలో మల్టీపర్పస్ బిల్డింగ్ శంకుస్థాపన

ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కాలేజీలో మల్టీపర్పస్ బిల్డింగ్ శంకుస్థాపన
February 12, 2026 08:45 PM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : CHOUTUPPAL MANDAL
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పట్టణం ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కాలేజ్ లో గురువారం నూతనంగా సోలియల్ లక్ష్మి రెడ్డి మల్టీపర్పస్ బిల్డింగ్ కట్టడానికి శంకుస్థాపన ముస్కు మధుసూదన్ రెడ్డి స్పోర్ట్స్ కళాశాల చైర్మన్ డాక్టర్ ముస్కు మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ తంగడపల్లిలో ఉన్న ముస్కు మధుసూదన్ రెడ్డి వ్యాయామ కళాశాలలో అన్ని సౌకర్యాలు గల ఒక బిల్డింగ్ కట్టడం శంకుస్థాపన చేయడం జరిగినది అన్నారు. ఈ స్టేడియంలో స్పోర్ట్స్ రావడానికి విద్యార్థులు వచ్చినప్పుడు వారికి నివాస ఉండటానికి ఇబ్బందిగా ఉండటం వలన కొత్తగా మల్టీపర్పస్ బిల్డింగ్ కట్టాలని ఆ బిల్డింగ్ తన మనమరాలు పేరుతో కట్టడానికి శంకుస్థాపన చేశారు. ముస్కు మధుసూదన్ రెడ్డి కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేసిన బీచ్ వాలీబాల్ కోర్టును ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కళాశాలలో విద్యార్థులు ఆడుకోవడానికి బీచ్ వాలీబాల్ గ్రౌండ్ ను తయారు చేసే ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాలేజీ కాంట్రాక్టర్ రాజేందర్ రెడ్డి, మాజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ రాజు, ఫ్యాకల్టీస్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News