ముప్పా నరసింహారెడ్డి సేవలు మరువలేనివి
ముప్పా నరసింహారెడ్డి సేవలు మరువలేనివి
Editor Desk
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్:
ప్రముఖ విద్యావేత్త ముప్పా నరసింహారెడ్డి (ఎం.ఎన్.రెడ్డి) సేవలు సమాజానికి మరువలేనివని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల పట్టణానికి చెందిన ఎం.ఎన్.రెడ్డి సంతాప సభలో పాల్గొన్న ఆయన, మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యారంగంలో ఆయన చేసిన విశేష సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.ఈ సంతాప సభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొని ముప్పా నరసింహారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోకల దేవదాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, బొబ్బలి రాంరెడ్డి, రెముడాల మధు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి