Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ రికార్డులతో మెరిసిన లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీ వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 08:04 PM

ముప్పా నరసింహారెడ్డి సేవలు మరువలేనివి

ముప్పా నరసింహారెడ్డి సేవలు మరువలేనివి

ముప్పా నరసింహారెడ్డి సేవలు మరువలేనివి
January 13, 2026 08:55 PM 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్:

ప్రముఖ విద్యావేత్త ముప్పా నరసింహారెడ్డి (ఎం.ఎన్.రెడ్డి) సేవలు సమాజానికి మరువలేనివని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల పట్టణానికి చెందిన ఎం.ఎన్.రెడ్డి సంతాప సభలో పాల్గొన్న ఆయన, మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యారంగంలో ఆయన చేసిన విశేష సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.ఈ సంతాప సభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొని ముప్పా నరసింహారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోకల దేవదాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, బొబ్బలి రాంరెడ్డి, రెముడాల మధు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News