Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:57 PM

మునుగోడు లో దివ్యాంగులకు ఆరోగ్య శిబిరాలు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మునుగోడు లో దివ్యాంగులకు ఆరోగ్య శిబిరాలు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

మునుగోడు లో దివ్యాంగులకు ఆరోగ్య శిబిరాలు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
February 19, 2026 10:57 PM 184 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని దివ్యాంగుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆయన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మునుగోడులో దివ్యాంగుల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహించాలనీ కోరారు.స్పైనల్ కార్డ్, మస్కులర్ సంబంధిత దివ్యాంగులకు ప్రతి నెల అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఇతర అవసరమైన వస్తుసామగ్రిని అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మునుగోడు నియోజకవర్గంలోని దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ‘వికలాంగుల భవనం’ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దివ్యాంగుల సమస్యల పట్ల తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని, భవిష్యత్తులో తప్పకుండా అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జి పబ్బు రాజుగౌడ్, టీవీహెచ్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ, రాష్ట్ర కార్యదర్శి మెరుగు శివకృష్ణ, మహిళా నాయకురాలు యశోద గోదా, కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం, కొడిదల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News