మునుగోడు లో దివ్యాంగులకు ఆరోగ్య శిబిరాలు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మునుగోడు లో దివ్యాంగులకు ఆరోగ్య శిబిరాలు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
K.RAVI
తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని దివ్యాంగుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆయన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మునుగోడులో దివ్యాంగుల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహించాలనీ కోరారు.స్పైనల్ కార్డ్, మస్కులర్ సంబంధిత దివ్యాంగులకు ప్రతి నెల అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఇతర అవసరమైన వస్తుసామగ్రిని అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మునుగోడు నియోజకవర్గంలోని దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ‘వికలాంగుల భవనం’ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దివ్యాంగుల సమస్యల పట్ల తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని, భవిష్యత్తులో తప్పకుండా అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జి పబ్బు రాజుగౌడ్, టీవీహెచ్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ, రాష్ట్ర కార్యదర్శి మెరుగు శివకృష్ణ, మహిళా నాయకురాలు యశోద గోదా, కాంగ్రెస్ దివ్యాంగుల విభాగం, కొడిదల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి