PRINT TIME: February 23, 2026 08:57 PM
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
February 13, 2026 10:51 PM
273 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
యాదాద్రి జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
“రాబోయే రోజుల్లో నాకు మంత్రి పదవి వస్తుంది... మంత్రి కాకపోతే ముఖ్యమంత్రిని అవుతా...” అంటూ స్పష్టం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ –
“మునుగోడు మీరు చూసుకోండి... తెలంగాణ నేను చూసుకుంటా... నాకు అడుక్కోవడం రాదు... మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వండి... లేదంటే లాక్కునే దాకా చూసుకోకండి...” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీలోనే అంతర్గత విభేదాలపై ఇవి సంకేతాలా? లేక భవిష్యత్తు రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి