మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పోటీ
మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పోటీ
Biksham Goud
సూర్యాపేటలో అన్ని వార్డుల్లో అభ్యర్థులు – సతీష్ రెడ్డి
సూర్యాపేట:
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రితిక ఇన్ బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతోందన్నారు.
బీజేపీతో పొత్తుపై ప్రస్తుతం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు సాధించిన విజయాలు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని అన్నారు. అదే స్ఫూర్తితో మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ సత్తా చాటి అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పార్టీ ఆశయాలు, విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురిని జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి