మున్సిపల్ కార్యాలయంలో తుది ఓటర్ల జాబితా ప్రదర్శన
మున్సిపల్ కార్యాలయంలో తుది ఓటర్ల జాబితా ప్రదర్శన
Biksham
ప్రజల సౌకర్యార్థం పోలింగ్ స్టేషన్ల వారీగా అందుబాటులో ఉంచిన అధికారులు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
మున్సిపల్ సాధారణ ఎన్నికల సందర్భంగా పోలింగ్ స్టేషన్ల వారీగా రూపొందించిన తుది ఓటర్ల జాబితాలను ప్రజల సౌకర్యార్థం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శించారు. ఓటర్లకు తమ వివరాలను సులభంగా పరిశీలించుకునే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ తుది ఓటర్ల జాబితాలను జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పాటిస్తూ ప్రతి ఓటరుకు సమాచారం చేరేలా చర్యలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాలను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. మున్సిపల్ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ కిరణ్, మేనేజర్ బుచ్చి బాబు, టీపీఓ సోమయ్య, ఆర్వో కళ్యాణి, సీనియర్ అసిస్టెంట్ నాగయ్య, బీఐ అఖిల్, జూనియర్ అసిస్టెంట్లు యం.డి. గౌసుద్దీన్, ఎస్.ఎస్.ఆర్. ప్రసాద్, వీరాస్వామి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి