Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:03 AM

మున్సిపల్ కార్యాలయంలో తుది ఓటర్ల జాబితా ప్రదర్శన

మున్సిపల్ కార్యాలయంలో తుది ఓటర్ల జాబితా ప్రదర్శన

మున్సిపల్ కార్యాలయంలో తుది ఓటర్ల జాబితా ప్రదర్శన
January 16, 2026 07:47 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రజల సౌకర్యార్థం పోలింగ్ స్టేషన్‌ల వారీగా అందుబాటులో ఉంచిన అధికారులు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

మున్సిపల్ సాధారణ ఎన్నికల సందర్భంగా పోలింగ్ స్టేషన్‌ల వారీగా రూపొందించిన తుది ఓటర్ల జాబితాలను ప్రజల సౌకర్యార్థం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శించారు. ఓటర్లకు తమ వివరాలను సులభంగా పరిశీలించుకునే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ తుది ఓటర్ల జాబితాలను జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పాటిస్తూ ప్రతి ఓటరుకు సమాచారం చేరేలా చర్యలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్‌ల వారీగా ఓటర్ల జాబితాలను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. మున్సిపల్ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ కిరణ్, మేనేజర్ బుచ్చి బాబు, టీపీఓ సోమయ్య, ఆర్వో కళ్యాణి, సీనియర్ అసిస్టెంట్ నాగయ్య, బీఐ అఖిల్, జూనియర్ అసిస్టెంట్లు యం.డి. గౌసుద్దీన్, ఎస్.ఎస్.ఆర్. ప్రసాద్, వీరాస్వామి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News