Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:18 PM

మున్సిపల్ ఎన్నికలపై బిఆర్ఎస్ నాయకుల కీలక భేటీ

మున్సిపల్ ఎన్నికలపై బిఆర్ఎస్ నాయకుల కీలక భేటీ

మున్సిపల్ ఎన్నికలపై బిఆర్ఎస్ నాయకుల కీలక భేటీ
January 13, 2026 05:57 PM 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మున్సిపాలిటీలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ జయపాల్ రెడ్డి మరియు నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నారాయణఖేడ్ మున్సిపాలిటీలో తప్పకుండా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికపై వివరంగా చర్చించారు.ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్, మాజీ ఉపాధ్యక్షులు పరశురాం, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు విజయ్ బుజ్జి, మాజీ ఎంపిటిసి సభ్యులు ముజామిల్, మాజీ కౌన్సిలర్లు అభిషేక్ షెత్కార్, విఠల్, మాజీ మున్సిపల్ సహనియుక్త సభ్యులు లయక్, అంబాదాస్, ఉబేద్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్, నాయకులు సతీశ్ దేశ్ముక్, కొమ్ము శేఖర్, అబ్బు, దుర్గయ్య, నర్సింలు, నాగరాజు, కిరణ్ రావు పాటిల్, అశోక్ రెడ్డి, తుకారాం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించేలా అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News