మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు పూర్తి
మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు పూర్తి
Biksham
జనవరి 12న ఫైనల్ ఓటర్ లిస్ట్,16న పోలింగ్ స్టేషన్ల వివరాలు
ఫిబ్రవరి 20లోపు ఎన్నికలు జరిగే అవకాశం
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక దశలను పూర్తి చేస్తోంది. ఈ నెల 12వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్ట్ను, 16వ తేదీన వార్డు వారీగా పోలింగ్ స్టేషన్ల వివరాలను పబ్లిష్ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేయనుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వార్డు వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఓటర్ లిస్ట్ ఆధారంగా గుర్తించి, నిర్దేశించిన గడువులో మున్సిపాలిటీలు సంబంధిత జాబితాలను ప్రచురించనున్నాయి. జనాభా ఆధారంగా వార్డు రిజర్వేషన్లు వార్డు వారీగా గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా ఆధారంగా వార్డులను ఫిల్టర్ చేసి, ఆ వివరాలతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఓపెన్ డ్రా పద్ధతిలో వార్డు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇందులో భాగంగా 50 శాతం సీట్లను మహిళలకు రిజర్వేషన్గా కేటాయించనున్నారు.హైదరాబాద్లో ఛైర్మన్ డ్రా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్మన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను హైదరాబాద్లో రొటేషన్ పద్ధతిలో డ్రా తీసి ఖరారు చేయనున్నారు.ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు అవకాశాలు ముఖ్యమంత్రి దావోస్ పర్యటన, అలాగే ఫిబ్రవరి తొలి వారంలో జరిగే తెలంగాణలో అతిపెద్ద సమ్మక్క–సారక్క జాతర నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని, మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరి 20వ తేదీ లోపు పూర్తిచేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
మొత్తంగా చూస్తే, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం వేగంగా ముందుకు సాగుతుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి