Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:38 AM

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తత అవసరం

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తత అవసరం

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తత అవసరం
January 13, 2026 08:36 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పోలింగ్ బూత్ వసతులు,ఉద్యోగుల తటస్థతపై అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశాలు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మంగళవారం చౌటుప్పల్ పురపాలక సంఘంలో వార్డు ఆఫీసర్లు,బిల్ కలెక్టర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయబడింది.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి పోలింగ్ బూత్‌లో ప్రాథమిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని స్పష్టం చేశారు.పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు,విద్యుత్ వసతి,సరైన వెంటిలేషన్,కిటికీలు,తలుపులు, మరుగుదొడ్లు,ర్యాంపు వంటి అన్ని సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని,ఈ కాలంలో సెలవులు మంజూరు చేయబడవని తెలిపారు.ఎన్నికల విధుల్లో ఉన్న ఎవరూ ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదనంగా,ఈరోజు డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్‌ల వివరాలను విడుదల చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.వెంకట్రాం రెడ్డి,మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి,ఆర్వో అంజయ్య,సీనియర్ అసిస్టెంట్లు దీప,రఘుపతి,వార్డు ఆఫీసర్లు,బిల్ కలెక్టర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News