Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:26 AM

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తత అవసరం

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తత అవసరం

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తత అవసరం
13-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పోలింగ్ బూత్ వసతులు,ఉద్యోగుల తటస్థతపై అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశాలు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మంగళవారం చౌటుప్పల్ పురపాలక సంఘంలో వార్డు ఆఫీసర్లు,బిల్ కలెక్టర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయబడింది.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి పోలింగ్ బూత్‌లో ప్రాథమిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని స్పష్టం చేశారు.పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు,విద్యుత్ వసతి,సరైన వెంటిలేషన్,కిటికీలు,తలుపులు, మరుగుదొడ్లు,ర్యాంపు వంటి అన్ని సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని,ఈ కాలంలో సెలవులు మంజూరు చేయబడవని తెలిపారు.ఎన్నికల విధుల్లో ఉన్న ఎవరూ ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదనంగా,ఈరోజు డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్‌ల వివరాలను విడుదల చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.వెంకట్రాం రెడ్డి,మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి,ఆర్వో అంజయ్య,సీనియర్ అసిస్టెంట్లు దీప,రఘుపతి,వార్డు ఆఫీసర్లు,బిల్ కలెక్టర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తత అవసరం

Article Image

పోలింగ్ బూత్ వసతులు,ఉద్యోగుల తటస్థతపై అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశాలు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మంగళవారం చౌటుప్పల్ పురపాలక సంఘంలో వార్డు ఆఫీసర్లు,బిల్ కలెక్టర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయబడింది.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి పోలింగ్ బూత్‌లో ప్రాథమిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని స్పష్టం చేశారు.పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు,విద్యుత్ వసతి,సరైన వెంటిలేషన్,కిటికీలు,తలుపులు, మరుగుదొడ్లు,ర్యాంపు వంటి అన్ని సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని,ఈ కాలంలో సెలవులు మంజూరు చేయబడవని తెలిపారు.ఎన్నికల విధుల్లో ఉన్న ఎవరూ ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదనంగా,ఈరోజు డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్‌ల వివరాలను విడుదల చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.వెంకట్రాం రెడ్డి,మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి,ఆర్వో అంజయ్య,సీనియర్ అసిస్టెంట్లు దీప,రఘుపతి,వార్డు ఆఫీసర్లు,బిల్ కలెక్టర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News