మునిపల్లి మండలంలో 14.50 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ
మునిపల్లి మండలంలో 14.50 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ
Krishna
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యం. సుధాకర్ రెడ్డి, మునిపల్లి మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ విజయ్, చిన్న చెల్మెడ సర్పంచ్ గాయత్రి రుద్ర కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మండలంలోని 41 మంది లబ్ధిదారులకు మొత్తం పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సహాయం ద్వారా అవసరంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి