మహానేతకు ఘన నివాళులు అర్పించిన చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ పురపాలక కార్యాలయంలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మొగదాల పావని రమేష్ గౌడ్ పుష్పాంజలి ఘటించి మహానేతకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప సంఘ సంస్కర్తగా డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ దేశ నిర్మాణంలో విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. తన పరిపాలనా దక్షతతో దేశానికి ఉప ప్రధానిగా సేవలందిస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పురపాలక సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి