మున్సిపల్ వైస్ చైర్మన్గా గోశిక వినయ్ కుమార్
మున్సిపల్ వైస్ చైర్మన్గా గోశిక వినయ్ కుమార్
K.RAVI
పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం
చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన పద్మశాలి నాయకుడు గోశిక వినయ్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనను పద్మశాలి యువజన సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు దోర్నాల గజేందర్ నేత పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. చిన్న వయసులోనే ఉన్నత పదవి సాధించడం గర్వకారణం సమాజ అభివృద్ధికి కృషి చేయాలని గజేందర్ నేత ఆకాంక్ష, ఈ సందర్భంగా దోర్నాల గజేందర్ నేత మాట్లాడుతూ, అతి చిన్న వయసులో కౌన్సిలర్గా విజయం సాధించి వైస్ చైర్మన్ పదవిని అధిరోహించడం సాధారణ విషయం కాదని అన్నారు. యువతకు ఇది స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పద్మశాలి సమాజ అభ్యున్నతికి గోశిక వినయ్ కుమార్ తన వంతు సహకారం అందించాలని కోరారు.ఈ సన్మాన కార్యక్రమంలో పద్మశాలి నాయకులు గోలి శ్రీను, బత్తుల యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి