Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:05 PM

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు
February 12, 2026 06:36 PM 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆరు మున్సిపాలిటీలలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సమగ్రంగా పరిశీలించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి గురువారం దివ్య బాల స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్‌ను సందర్శించారు.

కౌంటింగ్ హాళ్ల ఏర్పాటు, టేబుళ్ల అమరికలు, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక వసతులపై కలెక్టర్ విపులంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల్లో అత్యంత కీలక దశ. ప్రతి అంశంలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ, పారదర్శకతతో పాటు సమయపాలనను కచ్చితంగా అమలు చేయాలి” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News