Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సర్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:40 PM

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు
February 12, 2026 06:36 PM 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆరు మున్సిపాలిటీలలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సమగ్రంగా పరిశీలించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి గురువారం దివ్య బాల స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్‌ను సందర్శించారు.

కౌంటింగ్ హాళ్ల ఏర్పాటు, టేబుళ్ల అమరికలు, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక వసతులపై కలెక్టర్ విపులంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల్లో అత్యంత కీలక దశ. ప్రతి అంశంలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ, పారదర్శకతతో పాటు సమయపాలనను కచ్చితంగా అమలు చేయాలి” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News