మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు
మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆరు మున్సిపాలిటీలలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సమగ్రంగా పరిశీలించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి గురువారం దివ్య బాల స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ను సందర్శించారు.
కౌంటింగ్ హాళ్ల ఏర్పాటు, టేబుళ్ల అమరికలు, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక వసతులపై కలెక్టర్ విపులంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల్లో అత్యంత కీలక దశ. ప్రతి అంశంలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ, పారదర్శకతతో పాటు సమయపాలనను కచ్చితంగా అమలు చేయాలి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి