Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెండు గంటల్లోనే వాహన దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 12:28 PM

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు
12-02-2026 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆరు మున్సిపాలిటీలలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సమగ్రంగా పరిశీలించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి గురువారం దివ్య బాల స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్‌ను సందర్శించారు.

కౌంటింగ్ హాళ్ల ఏర్పాటు, టేబుళ్ల అమరికలు, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక వసతులపై కలెక్టర్ విపులంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల్లో అత్యంత కీలక దశ. ప్రతి అంశంలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ, పారదర్శకతతో పాటు సమయపాలనను కచ్చితంగా అమలు చేయాలి” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – కలెక్టర్ హనుమంతరావు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆరు మున్సిపాలిటీలలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సమగ్రంగా పరిశీలించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి గురువారం దివ్య బాల స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్‌ను సందర్శించారు.

కౌంటింగ్ హాళ్ల ఏర్పాటు, టేబుళ్ల అమరికలు, సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా చర్యలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక వసతులపై కలెక్టర్ విపులంగా పరిశీలించారు. ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల్లో అత్యంత కీలక దశ. ప్రతి అంశంలో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ, పారదర్శకతతో పాటు సమయపాలనను కచ్చితంగా అమలు చేయాలి” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News