Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:30 AM

మున్సిపల్ కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. కలెక్టర్ హనుమంతరావు
February 11, 2026 01:35 PM 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలి.

భువనగిరి, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఎటువంటి అంతరాయాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.బుధవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి మండలంలోని దివ్య బాల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు.ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్స్, సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా చర్యలు, టేబుళ్ల అమరిక, సిబ్బంది నియామకాలు వంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి టేబుల్ వద్ద అన్జర్వర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అభ్యర్థులు, వారి ఏజెంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, కూర్చునే సౌకర్యం, ప్రాథమిక వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేసి, అనుమతి ఉన్నవారికే ప్రవేశం కల్పించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కౌంటింగ్ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించి ఫలితాలను సమయానికి ప్రకటించాలని అధికారులను కలెక్టర్ కోరారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News