Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:47 PM

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం
January 21, 2026 01:47 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:మున్సిపాలిటీ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ రోజు తొర్రూరు డివిజన్ పరిధిలో సుమారు 150 మందికి పైగా మున్సిపల్ కార్మికులు పూటపూట పారిశుద్ధ పనులు నిర్వర్తిస్తున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు,మహిళలు మరియు ఇతర సేవా కార్యకర్తలు సక్రమంగా పాల్గొన్నారు.నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ స్థానిక ఎమ్మెల్యే యశస్వి రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు మునిసిపల్ కమిషనర్‌లతో చర్చించి, కార్మికులకు అవసరమైన మౌలిక వసతులు వెంటనే అందించాలని నిర్ధారించారు. పారిశుద్ధ కార్మికుల శ్రమ వలనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది. వారి కృషి, అనుభవం, పట్టుదల మరియు అంకితభావం అమూల్యమైనదని ప్రత్యేకంగా గుర్తించారు.ఈ సందర్భంగా, కార్మికులు కోరిన హ్యాండ్ బ్లౌజులు, నూనె, పౌడర్, జీతభత్యాలు సమయానికి అందించబడతాయని హామీ ఇచ్చారు. అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం మునిసిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, కార్మికులకు పూర్తి రక్షణ, భద్రత, వసతులు అందించబడుతాయని మీడియా ద్వారా వెల్లడించారు.నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికుల కృషి, వారికి అందే గౌరవం మరియు శ్రద్ధ ప్రాముఖ్యత ఉన్నదని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమం ద్వారా మున్సిపల్ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించడం, వారి జీవితాలను మెరుగుపరచడం, పట్టణ పరిరక్షణకు మద్దతుగా ఉండడం లక్ష్యంగా పెట్టబడినదని తెలిపారు.ప్రజాసేవలోనూ, పట్టణ పరిశుభ్రతలోనూ, మున్సిపల్ కార్మికుల పాత్ర అత్యంత ముఖ్యమైనదని, వారికి తగిన గౌరవం, మద్దతు ఇవ్వడం ప్రతి ప్రభుత్వ అధికారిగా, ప్రజాస్వామ్య బాధ్యతగా ఉందని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News