మున్సిపల్ కార్మికుల సమరభేరి
మున్సిపల్ కార్మికుల సమరభేరి
Komidala Mahender reddy
సమస్యలు తీర్చాలని సిఐటియు డిమాండ్
మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలని , గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లో తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి చిట్యాల మున్సిపల్ కార్మికులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కార్మికులతో కూడిన డీసీఎం ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించార ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాన్ని తక్షణమే చెల్లించాలిబని డిమాండ్ చేశారు. గతంలో కార్మిక సంఘాలకు ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలి అని , పెండింగ్లో ఉన్న బిల్లులు మరియు సౌకర్యాలను కల్పించాలని కోరారు. కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సభ్యులు పాల లక్ష్మయ్య , జిల్లా కమిటీ సభ్యులు మేడి శోభ, జనపాల జ్యోతి, యమున, అండాలు, ధనలక్ష్మి, వరమ్మ, కిషన్, శేఖర్, రమణ, నరేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి