Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

మున్సిపల్ కార్మికుల సమరభేరి

మున్సిపల్ కార్మికుల సమరభేరి

మున్సిపల్ కార్మికుల సమరభేరి
March 24, 2026 06:52 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సమస్యలు తీర్చాలని సిఐటియు డిమాండ్

​మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలని , గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి చిట్యాల మున్సిపల్ కార్మికులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కార్మికులతో కూడిన డీసీఎం ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించార ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాన్ని తక్షణమే చెల్లించాలిబని డిమాండ్ చేశారు. ​గతంలో కార్మిక సంఘాలకు ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలి అని , ​పెండింగ్‌లో ఉన్న బిల్లులు మరియు సౌకర్యాలను కల్పించాలని కోరారు. కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సభ్యులు పాల లక్ష్మయ్య , జిల్లా కమిటీ సభ్యులు మేడి శోభ, జనపాల జ్యోతి, యమున, అండాలు, ధనలక్ష్మి, వరమ్మ, కిషన్, శేఖర్, రమణ, నరేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News