Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:38 AM

మున్సిపల్ కార్మికుల సమరభేరి

మున్సిపల్ కార్మికుల సమరభేరి

మున్సిపల్ కార్మికుల సమరభేరి
24-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సమస్యలు తీర్చాలని సిఐటియు డిమాండ్

​మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలని , గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి చిట్యాల మున్సిపల్ కార్మికులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కార్మికులతో కూడిన డీసీఎం ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించార ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాన్ని తక్షణమే చెల్లించాలిబని డిమాండ్ చేశారు. ​గతంలో కార్మిక సంఘాలకు ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలి అని , ​పెండింగ్‌లో ఉన్న బిల్లులు మరియు సౌకర్యాలను కల్పించాలని కోరారు. కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సభ్యులు పాల లక్ష్మయ్య , జిల్లా కమిటీ సభ్యులు మేడి శోభ, జనపాల జ్యోతి, యమున, అండాలు, ధనలక్ష్మి, వరమ్మ, కిషన్, శేఖర్, రమణ, నరేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ కార్మికుల సమరభేరి

Article Image

సమస్యలు తీర్చాలని సిఐటియు డిమాండ్

​మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలని , గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి చిట్యాల మున్సిపల్ కార్మికులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కార్మికులతో కూడిన డీసీఎం ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించార ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాన్ని తక్షణమే చెల్లించాలిబని డిమాండ్ చేశారు. ​గతంలో కార్మిక సంఘాలకు ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలి అని , ​పెండింగ్‌లో ఉన్న బిల్లులు మరియు సౌకర్యాలను కల్పించాలని కోరారు. కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సభ్యులు పాల లక్ష్మయ్య , జిల్లా కమిటీ సభ్యులు మేడి శోభ, జనపాల జ్యోతి, యమున, అండాలు, ధనలక్ష్మి, వరమ్మ, కిషన్, శేఖర్, రమణ, నరేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News