Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:55 PM

మున్సిపల్ ఎన్నికలు ప్రిసైడింగ్ అధికారులకు ముమ్మర శిక్షణ

మున్సిపల్ ఎన్నికలు ప్రిసైడింగ్ అధికారులకు ముమ్మర శిక్షణ

మున్సిపల్ ఎన్నికలు ప్రిసైడింగ్ అధికారులకు ముమ్మర శిక్షణ
February 06, 2026 06:47 PM 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి

చౌటుప్పల్ పురపాలక సంఘం రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా,ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎన్నికల ముఖ్యఅధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అధికారులకు దిశానిర్దేశం చేశారు.మాస్టర్ ట్రైనర్స్ నరేందర్ రెడ్డి, దశరథ శిక్షణ ఇచ్చారు. మొత్తం 96 మంది ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.శిక్షణలో భాగంగా పోలింగ్ రోజున అధికారులు పాటించాల్సిన నిబంధనలు, ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ,అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన, బ్యాలెట్ బాక్స్ సీలింగ్ మొదలైన విషయాలు క్షుణ్ణంగా వివరించారు.ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా,శాంతియుతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.సహాయ జిల్లా ఎన్నికల అధికారి,మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగింది.వారు మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల విధుల్లో అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వీర బాయి, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఎంఈఓ గురువారావు, మున్సిపల్ ఆర్వో అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, రేణు కుమార్ పర్యావరణ ఇంజనీర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News