Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:12 AM

మున్సిపల్ ఎన్నికలు ప్రిసైడింగ్ అధికారులకు ముమ్మర శిక్షణ

మున్సిపల్ ఎన్నికలు ప్రిసైడింగ్ అధికారులకు ముమ్మర శిక్షణ

మున్సిపల్ ఎన్నికలు ప్రిసైడింగ్ అధికారులకు ముమ్మర శిక్షణ
06-02-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి

చౌటుప్పల్ పురపాలక సంఘం రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా,ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎన్నికల ముఖ్యఅధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అధికారులకు దిశానిర్దేశం చేశారు.మాస్టర్ ట్రైనర్స్ నరేందర్ రెడ్డి, దశరథ శిక్షణ ఇచ్చారు. మొత్తం 96 మంది ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.శిక్షణలో భాగంగా పోలింగ్ రోజున అధికారులు పాటించాల్సిన నిబంధనలు, ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ,అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన, బ్యాలెట్ బాక్స్ సీలింగ్ మొదలైన విషయాలు క్షుణ్ణంగా వివరించారు.ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా,శాంతియుతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.సహాయ జిల్లా ఎన్నికల అధికారి,మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగింది.వారు మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల విధుల్లో అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వీర బాయి, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఎంఈఓ గురువారావు, మున్సిపల్ ఆర్వో అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, రేణు కుమార్ పర్యావరణ ఇంజనీర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికలు ప్రిసైడింగ్ అధికారులకు ముమ్మర శిక్షణ

Article Image

కమిషనర్ జి వెంకట్రాంరెడ్డి

చౌటుప్పల్ పురపాలక సంఘం రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా,ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎన్నికల ముఖ్యఅధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అధికారులకు దిశానిర్దేశం చేశారు.మాస్టర్ ట్రైనర్స్ నరేందర్ రెడ్డి, దశరథ శిక్షణ ఇచ్చారు. మొత్తం 96 మంది ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.శిక్షణలో భాగంగా పోలింగ్ రోజున అధికారులు పాటించాల్సిన నిబంధనలు, ఓటింగ్ ప్రక్రియ నిర్వహణ,అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన, బ్యాలెట్ బాక్స్ సీలింగ్ మొదలైన విషయాలు క్షుణ్ణంగా వివరించారు.ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా,శాంతియుతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.సహాయ జిల్లా ఎన్నికల అధికారి,మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగింది.వారు మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల విధుల్లో అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వీర బాయి, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఎంఈఓ గురువారావు, మున్సిపల్ ఆర్వో అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, రేణు కుమార్ పర్యావరణ ఇంజనీర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News