Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:52 PM

"మున్సిపల్ ఎన్నికల్లో షార్ప్ తనిఖీలు: పవార్ ఆదేశాలు"

"మున్సిపల్ ఎన్నికల్లో షార్ప్ తనిఖీలు: పవార్ ఆదేశాలు"

"మున్సిపల్ ఎన్నికల్లో షార్ప్ తనిఖీలు: పవార్ ఆదేశాలు"
February 07, 2026 06:55 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

"మున్సిపల్ ఎన్నికల్లో షార్ప్ తనిఖీలు: పవార్ ఆదేశాలు"

నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పకడబందీ తనిఖీలు చేపట్టారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. మద్యం, నగదు, గిఫ్ట్ వస్తువుల అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాలను పరిశీలించారు. ప్రధాన రహదారులు, గ్రామీణ మార్గాలు, పట్టణ ప్రాంతాల్లో వాహనాలపై క్షుణ్ణ తనిఖీలు జరుగుతున్నాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై విస్తృతంగా పరిశీలనలు చేస్తున్నారు. ఎస్పీ మాట్లాడుతూ, "నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం సహించేది లేదు. ప్రజలు ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి" అని హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్‌ఐ గోపాల్ రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజాగంగా, నియమాల ప్రకారం జరగాలని అధికారులు ఆకాంక్షిస్తున్నారు. ఈ చర్యలతో ఎన్నికలు ఆరోగ్యకరంగా సవ్యంగా జరిగి, జిల్లాలో శాంతి నెలకొంటుందని ఆశ. పోలీసులు 24 గంటల పాటు విజిలెన్స్‌లో ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News