మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన ఎమ్మెల్యే అనుపమ సంజీవరెడ్డి దంపతులు
మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన ఎమ్మెల్యే అనుపమ సంజీవరెడ్డి దంపతులు
Krishna
నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక శాసనసభ్యులు అనుపమ సంజీవరెడ్డి దంపతులు బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొమ్మిదో వార్డులోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని వారు ప్రశాంత వాతావరణంలో తమ ఓటును నమోదు చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అమూల్యమనే సందేశాన్ని ఇస్తూ, ప్రజలందరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అనుపమ సంజీవరెడ్డి పిలుపునిచ్చారు.పట్టణ అభివృద్ధి,ప్రజా సమస్యల పరిష్కారం కోసం సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తొమ్మిదో వార్డు అభ్యర్థి బాణాపురం రాజు, ఇతర ముఖ్య నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లలో ఉత్సాహం కనిపించగా,మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.ప్రజాస్వామ్య పండుగలో భాగంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి