Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 10:48 AM

మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన ఎమ్మెల్యే అనుపమ సంజీవరెడ్డి దంపతులు

మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన ఎమ్మెల్యే అనుపమ సంజీవరెడ్డి దంపతులు

మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన ఎమ్మెల్యే అనుపమ సంజీవరెడ్డి దంపతులు
11-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక శాసనసభ్యులు అనుపమ సంజీవరెడ్డి దంపతులు బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొమ్మిదో వార్డులోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని వారు ప్రశాంత వాతావరణంలో తమ ఓటును నమోదు చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అమూల్యమనే సందేశాన్ని ఇస్తూ, ప్రజలందరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అనుపమ సంజీవరెడ్డి పిలుపునిచ్చారు.పట్టణ అభివృద్ధి,ప్రజా సమస్యల పరిష్కారం కోసం సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తొమ్మిదో వార్డు అభ్యర్థి బాణాపురం రాజు, ఇతర ముఖ్య నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లలో ఉత్సాహం కనిపించగా,మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.ప్రజాస్వామ్య పండుగలో భాగంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిన ఎమ్మెల్యే అనుపమ సంజీవరెడ్డి దంపతులు

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక శాసనసభ్యులు అనుపమ సంజీవరెడ్డి దంపతులు బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొమ్మిదో వార్డులోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని వారు ప్రశాంత వాతావరణంలో తమ ఓటును నమోదు చేశారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అమూల్యమనే సందేశాన్ని ఇస్తూ, ప్రజలందరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అనుపమ సంజీవరెడ్డి పిలుపునిచ్చారు.పట్టణ అభివృద్ధి,ప్రజా సమస్యల పరిష్కారం కోసం సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తొమ్మిదో వార్డు అభ్యర్థి బాణాపురం రాజు, ఇతర ముఖ్య నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లలో ఉత్సాహం కనిపించగా,మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.ప్రజాస్వామ్య పండుగలో భాగంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News