Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:42 PM

మున్సిపల్ ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించాలి

మున్సిపల్ ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించాలి

మున్సిపల్ ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించాలి
January 20, 2026 07:19 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

లౌకిక శక్తులతో కలిసి పోటీ – సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహ రెడ్డి భవన్‌లో నిర్వహించిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ, మండల పార్టీ కార్యదర్శుల సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో సిపిఎం పోటీ చేస్తుందని తెలిపారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో పార్టీ పోటీ చేసే స్థానాలపై చర్చ జరుగుతోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వచ్చే లౌకిక పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అవసరమైతే జిల్లాలో తమకు బలమున్న స్థానాల్లో ఒంటరిగా కూడా పోటీ చేస్తామని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై లోతైన అవగాహన కలిగి, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజాసేవకే అంకితమయ్యే సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రజా సమస్యలపై గళమెత్తి, వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు.

ఎన్నికల్లో డబ్బు ప్రభావం అధికంగా ఉండటంతో సేవ చేసేవారు ఓటమి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు డబ్బు, మద్యం ప్రభావం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News