Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:28 AM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తు
02-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రజా పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ

-భువనగిరి,పోచంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు మాదే : ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి

భువనగిరి పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐతో కలిసి పొత్తుతో బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒప్పందంలో భాగంగానే ఈ పొత్తు కొనసాగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడంలో కమ్యూనిస్టులు ముందుంటారని, అలాంటి పార్టితో కలిసి ప్రజల తరఫున బలమైన పోరాటం చేస్తామని అన్నారు. భువనగిరి, భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలలో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజారంజక పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజా పాలన–ప్రజా ప్రభుత్వం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో బృహత్తర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని అన్నారు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందని పేర్కొన్నారు.(హెచ్ ఎం డి ఏ)పరిధిలోకి వచ్చాక భువనగిరి పట్టణానికి రూ.56 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ హయాంలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ చేసి చూపిస్తోందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలు ఇవన్నీ గమనించి రానున్న ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తు

Article Image

ప్రజా పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ

-భువనగిరి,పోచంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు మాదే : ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి

భువనగిరి పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐతో కలిసి పొత్తుతో బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒప్పందంలో భాగంగానే ఈ పొత్తు కొనసాగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడంలో కమ్యూనిస్టులు ముందుంటారని, అలాంటి పార్టితో కలిసి ప్రజల తరఫున బలమైన పోరాటం చేస్తామని అన్నారు. భువనగిరి, భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలలో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజారంజక పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజా పాలన–ప్రజా ప్రభుత్వం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో బృహత్తర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని అన్నారు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందని పేర్కొన్నారు.(హెచ్ ఎం డి ఏ)పరిధిలోకి వచ్చాక భువనగిరి పట్టణానికి రూ.56 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ హయాంలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ చేసి చూపిస్తోందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలు ఇవన్నీ గమనించి రానున్న ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News