మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తు
Sthanikam District Staff Reporter
ప్రజా పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ
-భువనగిరి,పోచంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు మాదే : ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి
భువనగిరి పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐతో కలిసి పొత్తుతో బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒప్పందంలో భాగంగానే ఈ పొత్తు కొనసాగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడంలో కమ్యూనిస్టులు ముందుంటారని, అలాంటి పార్టితో కలిసి ప్రజల తరఫున బలమైన పోరాటం చేస్తామని అన్నారు. భువనగిరి, భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలలో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజారంజక పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజా పాలన–ప్రజా ప్రభుత్వం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో బృహత్తర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని అన్నారు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందని పేర్కొన్నారు.(హెచ్ ఎం డి ఏ)పరిధిలోకి వచ్చాక భువనగిరి పట్టణానికి రూ.56 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ హయాంలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ చేసి చూపిస్తోందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలు ఇవన్నీ గమనించి రానున్న ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి