Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:40 AM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తు
February 02, 2026 09:06 AM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రజా పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ

-భువనగిరి,పోచంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు మాదే : ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి

భువనగిరి పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనీల్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐతో కలిసి పొత్తుతో బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒప్పందంలో భాగంగానే ఈ పొత్తు కొనసాగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడంలో కమ్యూనిస్టులు ముందుంటారని, అలాంటి పార్టితో కలిసి ప్రజల తరఫున బలమైన పోరాటం చేస్తామని అన్నారు. భువనగిరి, భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలలో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజారంజక పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజా పాలన–ప్రజా ప్రభుత్వం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో బృహత్తర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని అన్నారు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందని పేర్కొన్నారు.(హెచ్ ఎం డి ఏ)పరిధిలోకి వచ్చాక భువనగిరి పట్టణానికి రూ.56 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ హయాంలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ చేసి చూపిస్తోందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలు ఇవన్నీ గమనించి రానున్న ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News