మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Harish HS
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకొస్తున్నాయని,
తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.సోమవారం కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలో క్లీన్ స్లిప్ సాధించబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు.రూ. 13,600 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలో 3 కోట్ల 17 లక్షల మందికి ప్రతి నెలా 6 కిలోల ఉచిత సన్న బియ్యం అందిస్తున్నామని,ఇది మా ప్రభుత్వ ల్యాండ్మార్క్ – గేమ్ ఛేంజర్ స్కీమ్ అని,స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి ఇంత పెద్ద స్థాయిలో సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని అన్నారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, కుటుంబ సభ్యులను చేర్చే అవకాశం కూడా కల్పించలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు.ఎలాంటి పైరవీలు లేకుండా, రాజకీయాలు లేకుండా, పార్టీ భేదం లేకుండా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం.200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్,ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం,మెరుగైన విద్య, వైద్య, మౌలిక వసతులు ప్రజలకు అందుతున్నాయని అన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల అభిప్రాయం చాలా స్పష్టం కాంగ్రెస్ తప్ప ఇతర పార్టీలకు ఓటేస్తే అది వృథా ఓటే అని అన్నారు.కాంగ్రెస్ కౌన్సిలర్లు, చైర్మన్లను గెలిపిస్తేనే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పట్టణాలకు మరింత నిధులు, మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.కోదాడ, హుజూర్నగర్, నేడ్చర్ల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ ఖాయం. కోదాడలో 35కి 35 వార్డులు, హుజూర్నగర్లో 28కి 28 వార్డులు,నేరేడుచర్లలో 15కి 15 వార్డులు కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన, ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తోంది.కుటుంబ పాలన నుంచి ప్రజా పాలన వైపు రాష్ట్రం ముందుకెళ్లింది అన్నారు.ఇటీవల మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టంగా హామీ ఇచ్చారు.తెలంగాణ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం.కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆయన అన్నారు.తెలంగాణ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం.కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి