Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:51 PM

మున్సిపల్ ఎన్నికల్లో అసలైన బీసీలకే బీసీ రిజర్వేషన్లు చెందాలి

మున్సిపల్ ఎన్నికల్లో అసలైన బీసీలకే బీసీ రిజర్వేషన్లు చెందాలి

మున్సిపల్ ఎన్నికల్లో అసలైన బీసీలకే బీసీ రిజర్వేషన్లు చెందాలి
January 31, 2026 08:28 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మరోసారి అన్యాయం

30 శాతం లోపలే రిజర్వేషన్లతో బీసీలకు నష్టం:56 శాతం రిజర్వేషన్ కల్పించాలి

- బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఆరు మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లను ఉద్దేశించి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి ఒక ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న భువనగిరి,భూదాన్ పోచంపల్లి,యాదగిరిగుట్ట,ఆలేరు,మోత్కూర్ మున్సిపాలిటీలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అసలైన బీసీలకే తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తగిన న్యాయం చేయలేదని విమర్శించారు.ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కేవలం 30 శాతం లోపలే రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలను రాజకీయంగా మరింత వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇతర కులమతాలకు చెందిన వారితో ప్రేమ వివాహాలు చేసుకున్న వారు కూడా బీసీ మహిళా రిజర్వేషన్లను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ,తరతరాలుగా బీసీ కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిజమైన బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్నారని అన్నారు.బీసీల రాజకీయ,సామాజిక అభివృద్ధి సాధ్యమవ్వాలంటే ప్రభుత్వం వెంటనే 56 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ అంశంపై ప్రభుత్వాలు,రాజకీయ పార్టీలు మరోసారి గంభీరంగా ఆలోచించాలని కోరారు. బీసీలకు న్యాయం జరగకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News