మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి
Biksham
తిరుమలగిరిలో బీఆర్ఎస్ నాయకుల సన్నాహక సమావేశం
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరుమలగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు డా. గాదరి కిశోర్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో పార్టీ బలాన్ని పెంచుతూ ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.పట్టణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజలతో నిత్యం అనుసంధానం కలిగి ఉండటం ద్వారా ఎన్నికల్లో విజయాన్ని సాధించవచ్చని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయానికి కృషి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో పట్టణ పార్టీ నాయకులు, వార్డు స్థాయి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి