Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:19 PM

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
February 10, 2026 06:38 PM 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించాలి

జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఈ నెల 11వ తేదీ బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి తీసుకురావాలని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన పోస్టాఫీస్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, కార్మిక గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ ద్వారా జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు లేదా ఇతర అధికారిక గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు.

ప్రతి ఓటరు తన ఓటు హక్కును వంద శాతం వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలోని నూట నలభై ఒకటి వార్డుల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.పోలింగ్ నిర్వహణకు నాలుగు వందల నలభై ఆరు పోలింగ్ అధికారులు, నాలుగు వందల నలభై ఆరు సహాయ పోలింగ్ అధికారులు, వెయ్యి మూడు వందల నలభై మంది ఓపిఓలను నియమించినట్లు చెప్పారు. ఎన్నికల సజావు నిర్వహణకు యాభై ఒకరు జోనల్ అధికారులు, నలభై ఆరు రూట్ అధికారులను నియమించామని తెలిపారు. స్వేచ్ఛాయుత, న్యాయబద్ధ ఎన్నికల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఎన్నికల సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు, తిరిగి స్ట్రాంగ్ రూములకు తరలింపుకు నలభై ఆరు బస్సులు సిద్ధం చేశామని, పోలీసు ఎస్కార్టుతో పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు.

అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జనరల్ పరిశీలకుడు పాండదాస్‌తో కలిసి ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News