మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు
Harish HS
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు
పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి.కాంగ్రెస్ పార్టీ పాలనకు విసిగిపోయిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.కోదాడ పట్టణంలోని 14వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపిదేశీ లక్ష్మీ ముత్తయ్య ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేడు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి