Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:55 AM

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలొ ముఖ్య అతిధిగా పాల్గొన్నచిరుమర్తి లింగయ్య

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలొ ముఖ్య అతిధిగా పాల్గొన్నచిరుమర్తి లింగయ్య

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలొ ముఖ్య అతిధిగా పాల్గొన్నచిరుమర్తి లింగయ్య
19-01-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. చిట్యాలలోని ముప్పా మల్లారెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని వార్డుల వారీగా పలువురు ఇంచార్జిలను ఆయన నియమించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ఇంటింటి ప్రచారం ముమ్మరం చేయడంతో పాటు ప్రజా సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని సూచించారు. బి ఆర్ఎస్ ప్రభుత్వo చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని, పార్టీపై ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని లింగయ్య సూచించారు. క్రమశిక్షణతో కూడిన సమన్వయపూర్వక కార్యాచరణతోనే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందన్నారు.o

ఈ సమావేశంలో పార్టీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు, యువ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాబోయే ఎన్నికలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికపై ఈ సమావేశం దిశానిర్దేశం చేసినట్లు నేతలు తెలిపారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలొ ముఖ్య అతిధిగా పాల్గొన్నచిరుమర్తి లింగయ్య

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. చిట్యాలలోని ముప్పా మల్లారెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని వార్డుల వారీగా పలువురు ఇంచార్జిలను ఆయన నియమించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ఇంటింటి ప్రచారం ముమ్మరం చేయడంతో పాటు ప్రజా సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని సూచించారు. బి ఆర్ఎస్ ప్రభుత్వo చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని, పార్టీపై ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని లింగయ్య సూచించారు. క్రమశిక్షణతో కూడిన సమన్వయపూర్వక కార్యాచరణతోనే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందన్నారు.o

ఈ సమావేశంలో పార్టీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు, యువ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాబోయే ఎన్నికలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికపై ఈ సమావేశం దిశానిర్దేశం చేసినట్లు నేతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News