మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలొ ముఖ్య అతిధిగా పాల్గొన్నచిరుమర్తి లింగయ్య
మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలొ ముఖ్య అతిధిగా పాల్గొన్నచిరుమర్తి లింగయ్య
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
చిట్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. చిట్యాలలోని ముప్పా మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని వార్డుల వారీగా పలువురు ఇంచార్జిలను ఆయన నియమించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో ఇంటింటి ప్రచారం ముమ్మరం చేయడంతో పాటు ప్రజా సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని సూచించారు. బి ఆర్ఎస్ ప్రభుత్వo చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని, పార్టీపై ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని లింగయ్య సూచించారు. క్రమశిక్షణతో కూడిన సమన్వయపూర్వక కార్యాచరణతోనే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందన్నారు.o
ఈ సమావేశంలో పార్టీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు, యువ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాబోయే ఎన్నికలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికపై ఈ సమావేశం దిశానిర్దేశం చేసినట్లు నేతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి