Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:39 AM

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
February 12, 2026 07:27 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించిన అధికారులకు,సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రాథమిక మరియు వివరాత్మక కౌంటింగ్ నిర్వహించాలని,రూల్ 56 ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని తెలిపారు. అలాగే యాక్ట్ 212 ప్రకారం గోప్యత (సీక్రసీ) పరిరక్షణను ఖచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను కౌంటింగ్ ఏజెంట్లకు స్పష్టంగా చూపించి, సంబంధిత అభ్యర్థి ట్రేలో సక్రమంగా వేయాలని ఆదేశించారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా,నియమ నిబంధనలకు అనుగుణంగా జరగాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ...కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు,సలహాలు జారీ చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఒక సూపర్వైజర్,ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను నియమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ నిర్వహించి,ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి,మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి,హరినాథ్ రెడ్డి,కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News