Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:01 AM

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
February 12, 2026 07:27 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- కలెక్టర్ హనుమంతరావు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించిన అధికారులకు,సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రాథమిక మరియు వివరాత్మక కౌంటింగ్ నిర్వహించాలని,రూల్ 56 ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని తెలిపారు. అలాగే యాక్ట్ 212 ప్రకారం గోప్యత (సీక్రసీ) పరిరక్షణను ఖచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను కౌంటింగ్ ఏజెంట్లకు స్పష్టంగా చూపించి, సంబంధిత అభ్యర్థి ట్రేలో సక్రమంగా వేయాలని ఆదేశించారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా,నియమ నిబంధనలకు అనుగుణంగా జరగాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ...కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు,సలహాలు జారీ చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఒక సూపర్వైజర్,ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను నియమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ నిర్వహించి,ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి,మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి,హరినాథ్ రెడ్డి,కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News