మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
Sthanikam District Staff Reporter
- కలెక్టర్ హనుమంతరావు
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించిన అధికారులకు,సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రాథమిక మరియు వివరాత్మక కౌంటింగ్ నిర్వహించాలని,రూల్ 56 ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని తెలిపారు. అలాగే యాక్ట్ 212 ప్రకారం గోప్యత (సీక్రసీ) పరిరక్షణను ఖచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రతి బ్యాలెట్ పేపర్ను కౌంటింగ్ ఏజెంట్లకు స్పష్టంగా చూపించి, సంబంధిత అభ్యర్థి ట్రేలో సక్రమంగా వేయాలని ఆదేశించారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా,నియమ నిబంధనలకు అనుగుణంగా జరగాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ...కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు,సలహాలు జారీ చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఒక సూపర్వైజర్,ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను నియమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ నిర్వహించి,ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి,మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి,హరినాథ్ రెడ్డి,కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి