Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:21 AM

మునగాల పోలీస్ వినూత్న ఆలోచన.

మునగాల పోలీస్ వినూత్న ఆలోచన.

మునగాల పోలీస్ వినూత్న ఆలోచన.
April 08, 2026 09:12 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

వేసవిలో పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు గేదల కొమ్ములకు రెడ్ రేడియం స్టికర్స్

జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామం ముకుందాపురంలో కార్యచరణ.

మునగాల మండల పరిధి జాతీయ రహదారి 65 పై వేసవికాలంలో పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా మునగాల మండల పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.మునగాల మండల పరిధి జాతీయ రహదారి 65 పై ప్రతి వేసవికాలంలో రాత్రిళ్ళు అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి పశువులు, ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారని దీనిని నివారించడం కోసం మునగాల పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశించారు. దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకొని మునగాల మండల పోలీసులు ముకుందాపురం గ్రామంలో గేదెలకు రెడ్ రేడియం స్టిక్కర్లు అందించడం జరిగింది ఈ రెడ్ రేడియం స్టిక్కర్లు వల్ల రాత్రిళ్ళు వాహనదారులకు పశువులు కనిపించి ప్రమాదాలను తప్పించవచ్చని మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి రాములమ్మ మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్, జాతీయ రహదారుల అధికారి ఫనీంద్ర, మునగాల పశువు వైద్యాధికారి భాస్కర్, హరిత, నరసింహారావు, గోపాలమిత్ర నాగరాజు సైదులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News