Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:11 AM

మునగాల మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన మండల కమిటీ ఎన్నిక

మునగాల మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన మండల కమిటీ ఎన్నిక

మునగాల మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన మండల కమిటీ ఎన్నిక
April 09, 2026 02:50 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

మునగాల మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన మండల కమిటీ ఎన్నిక

మునగాల మండల కేంద్రంలో గురువారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 మునగాల మండల నూతన కమిటీని జిల్లా పొలిటికల్ కన్వీనర్ బద్దంరాజు కృష్ణ ప్రసాద్, కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం అంజి,మునగాల మండల అధ్యక్షుడు వసంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మునగాల మండల టౌన్ అధ్యక్షుడిగా వేట అశోక్, మండల ఉపాధ్యక్షుడిగా గడ్డం వినోద్, జనరల్ సెక్రెటరీ చిర్ర వివేక్, జాయింట్ సెక్రెటరీ చిర్ర ప్రవీణ్, ట్రెజరర్ మహేందర్ వీరిని మండల నూతన కమిటీగా ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా పొలిటికల్ కన్వీనర్ బద్దం రాజు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. మునగాల మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. కమిటీల ఏర్పాటుకు కృషి చేస్తున్న కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం అంజిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. మండల కమిటీ ఆర్టిఐ బలోపేతానికి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా మండల కమిటీకి పిలుపునిచ్చినారు. ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం అంజి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 అధ్యక్షుడు డాక్టర్ నవీన్ తేజ ఆదేశాల మేరకు ఆయా మండల కమిటీలను ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మునగాల నూతన మండల కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. మునగాల మండలంలో ఆర్టిఐ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చినారు. అనంతరం జిల్లా పొలిటికల్ కన్వీనర్ బద్దం రాజు కృష్ణ ప్రసాద్, కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం అంజీలను మునగాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News