Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:18 PM

ముమ్మరంగా కొనసాగిన బార్ కౌన్సిల్ ఎన్నికల ఓటింగ్

ముమ్మరంగా కొనసాగిన బార్ కౌన్సిల్ ఎన్నికల ఓటింగ్

ముమ్మరంగా కొనసాగిన బార్ కౌన్సిల్ ఎన్నికల ఓటింగ్
January 30, 2026 06:36 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ముమ్మరంగా కొనసాగిన బార్ కౌన్సిల్ ఎన్నికల ఓటింగ్

తెలంగాణ బార్ కౌన్సిల్ కు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా కోదాడ పోలింగ్ కేంద్రం నెం.69లో ముమ్మరంగా పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రం నెం.69 కు ఎన్నికల ప్రధాన రిటర్నింగ్ ఆఫీసర్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, సహాయ పోలింగ్ అధికారులు గా రామిశెట్టి రామకృష్ణ, సాధు శరత్ బాబు,యడ్లపల్లి వెంకటేశ్వరరావులను తెలంగాణ బార్ కౌన్సిల్ నియమించారు. ఈ ఎన్నికల కు ఎన్నికల పరిశీలకులు గా మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎండి ఉమర్, సహాయకులు గా షేక్ మోసిన్ అలీ లు వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రధాన పోలింగ్ అధికారి లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులు 115మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 23స్థానాల కోసం 203 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా కోదాడ కోర్టులో ఉన్న 117 మంది ఓటర్ల లో 115 మంది తమ ప్రాధాన్యత లు ఇస్తూ ఓటు వేశారన్నారు. పోలింగ్ కేంద్రం, ఇతర ఏర్పాట్లను బార్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. బార్ కౌన్సిల్ కు పోటీ చేస్తున్న అభ్యర్థుల తరుపున న్యాయవాదులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బార్ కౌన్సిల్ అభ్యర్థి సాముల రాంరెడ్డి తన ఓటింగ్ సరళిని తెలుసుకునేందునకు వచ్చి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య, కోడూరు వెంకటేశ్వరరావు, సీనియర్ న్యాయవాదులు సుధాకర్ రెడ్డి, రాధాకృష్ణ మూర్తి, మేకల వెంకట్రావు, దేవబత్తిని నాగార్జున రావు, పాలేటి నాగేశ్వరరావు, కొండల్ రెడ్డి, ఎంవిఎస్ శాస్త్రి, రంజాన్ పాషా, సిలివేరు వెంకటేశ్వర్లు, సంపేట సుధాకర్, వాసు, కెఎల్ఎన్ ప్రసాద్, షేక్ హుస్సేన్, సామా నవీన్, ఎస్వి చలం, కె మురళి, షేక్ నయిమ్, ధనలక్ష్మి, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News