ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నల్లగొండ ఎస్పీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నల్లగొండ ఎస్పీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
నల్లగొండ స్థానికం ప్రతినిధి దాస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉండటంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ, నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సోమవారం జిల్లా ఎస్పీని వారి కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అవమానించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని “బొంద పెట్టాలి”, పార్టీ జెండా దిమ్మెలు కూల్చివేయాలంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఆందోళనను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇవి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే కాకుండా శాంతి భద్రతలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, నోముల భగత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కొండూరు సత్యనారాయణ, సయ్యద్ జాఫర్ జమల్ ఖాద్రి తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి