Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:55 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నల్లగొండ ఎస్పీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నల్లగొండ ఎస్పీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నల్లగొండ ఎస్పీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
January 20, 2026 04:21 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్లగొండ స్థానికం ప్రతినిధి దాస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉండటంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ, నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సోమవారం జిల్లా ఎస్పీని వారి కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అవమానించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని “బొంద పెట్టాలి”, పార్టీ జెండా దిమ్మెలు కూల్చివేయాలంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఆందోళనను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇవి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే కాకుండా శాంతి భద్రతలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, నోముల భగత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కొండూరు సత్యనారాయణ, సయ్యద్ జాఫర్ జమల్ ఖాద్రి తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News