ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న వేముల వీరేశం. జన్మదినం సందర్భంగా పలువురు మంత్రులను కలిసిన ప్రభుత్వ విప్
ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న వేముల వీరేశం. జన్మదినం సందర్భంగా పలువురు మంత్రులను కలిసిన ప్రభుత్వ విప్
Editor Desk
నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తన జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు చూపుతున్న అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.
నకిరేకల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాయకులు అలుగుబెల్లి రవీందర్ రెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డి, బండ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి