Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:37 AM

ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న వేముల వీరేశం. జన్మదినం సందర్భంగా పలువురు మంత్రులను కలిసిన ప్రభుత్వ విప్

ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న వేముల వీరేశం. జన్మదినం సందర్భంగా పలువురు మంత్రులను కలిసిన ప్రభుత్వ విప్

ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న వేముల వీరేశం.  జన్మదినం సందర్భంగా పలువురు మంత్రులను కలిసిన ప్రభుత్వ విప్
June 01, 2026 07:55 PM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తన జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు చూపుతున్న అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.

నకిరేకల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాయకులు అలుగుబెల్లి రవీందర్ రెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డి, బండ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News