Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:54 AM

ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న వేముల వీరేశం. జన్మదినం సందర్భంగా పలువురు మంత్రులను కలిసిన ప్రభుత్వ విప్

ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న వేముల వీరేశం. జన్మదినం సందర్భంగా పలువురు మంత్రులను కలిసిన ప్రభుత్వ విప్

ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న వేముల వీరేశం.  జన్మదినం సందర్భంగా పలువురు మంత్రులను కలిసిన ప్రభుత్వ విప్
01-06-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తన జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు చూపుతున్న అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.

నకిరేకల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాయకులు అలుగుబెల్లి రవీందర్ రెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డి, బండ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న వేముల వీరేశం. జన్మదినం సందర్భంగా పలువురు మంత్రులను కలిసిన ప్రభుత్వ విప్

Article Image

నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తన జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. తన జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు చూపుతున్న అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.

నకిరేకల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాయకులు అలుగుబెల్లి రవీందర్ రెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డి, బండ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News