Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:25 PM

ముగిసిన నామినేషన్ల పరిశీలన 126 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమం

ముగిసిన నామినేషన్ల పరిశీలన 126 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమం

ముగిసిన నామినేషన్ల పరిశీలన 126 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమం
January 31, 2026 07:56 PM 260 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్నికల అధికారి జి వెంకట్రాంరెడ్డి

చౌటుప్పల్ పురపాలక సంఘం 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శనివారం అత్యంత ప్రశాంతంగా ముగిసింది. స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ ప్రక్రియను రెవెన్యూ డివిజనల్ అధికారి స్వయంగా పర్యవేక్షించారు.నామినేషన్లు 20 వార్డుల నుండి వివిధ పార్టీల నుండి మొత్తం191 సెట్ల నామినేషన్ పత్రాలను 126 మంది అభ్యర్థులు సమర్పించడం జరిగింది.పరిశీలన అనంతరం అభ్యర్థులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు,సాంకేతిక అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాత,మొత్తం 126మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఆర్ ఓ, ఎ ఆర్ ఓ లు అధికారులు ధ్రువీకరించారు.

ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో అభ్యర్థుల సమక్షంలోనే ఈ పరిశీలన పారదర్శకంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు మధ్య ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు ఆర్థివో శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాం రెడ్డి వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News