ముగిసిన నామినేషన్ల పరిశీలన 126 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమం
ముగిసిన నామినేషన్ల పరిశీలన 126 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమం
K.RAVI
ఎన్నికల అధికారి జి వెంకట్రాంరెడ్డి
చౌటుప్పల్ పురపాలక సంఘం 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శనివారం అత్యంత ప్రశాంతంగా ముగిసింది. స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ ప్రక్రియను రెవెన్యూ డివిజనల్ అధికారి స్వయంగా పర్యవేక్షించారు.నామినేషన్లు 20 వార్డుల నుండి వివిధ పార్టీల నుండి మొత్తం191 సెట్ల నామినేషన్ పత్రాలను 126 మంది అభ్యర్థులు సమర్పించడం జరిగింది.పరిశీలన అనంతరం అభ్యర్థులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు,సాంకేతిక అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాత,మొత్తం 126మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఆర్ ఓ, ఎ ఆర్ ఓ లు అధికారులు ధ్రువీకరించారు.
ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో అభ్యర్థుల సమక్షంలోనే ఈ పరిశీలన పారదర్శకంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు మధ్య ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు ఆర్థివో శేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాం రెడ్డి వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి