Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:47 PM

ముగ్గురు కొడుకులున్నా ఆకలితో విలవిలలాడుతున్న వృద్ధ తల్లి

ముగ్గురు కొడుకులున్నా ఆకలితో విలవిలలాడుతున్న వృద్ధ తల్లి

ముగ్గురు కొడుకులున్నా ఆకలితో విలవిలలాడుతున్న వృద్ధ తల్లి
April 03, 2026 07:38 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బుక్కెడు అన్నం కోసం ఎదురుచూస్తున్న 95 ఏళ్ల వెంకమ్మ

కొడుకులకు బుద్ధి చెప్పి ఆదుకోవాలని అధికారులకు వేడుకోలు

సూర్యాపేట: మోతే మండలం నామవరం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ ఓ వృద్ధ తల్లి బుక్కెడు అన్నం కోసం ఎదురుచూస్తూ నిస్సహాయ స్థితిలో జీవిస్తోంది.

గ్రామానికి చెందిన నల్లగంతుల వెంకమ్మ (95) భర్త మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆమెకు పాపయ్య, వెంకన్న, ఎల్లయ్య అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. తండ్రి మరణానంతరం తల్లిని చూసుకుంటామని చెప్పిన కుమారులు, ఆమె పేరుమీద ఉన్న మూడు ఎకరాల తొమ్మిది గుంటల భూమిని తమ పేర్లకు మార్చించుకున్నారు. అనంతరం తల్లిని పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేశారు.

ఆకలితో అలమటిస్తున్న వెంకమ్మ స్థానికుల సహాయంతో జిల్లా కేంద్రంలోని ఆదాయ విభాగాధికారిని సంప్రదించింది. స్పందించిన అధికారి ముగ్గురు కుమారులను పిలిపించి ప్రతి ఒక్కరు నెలకు పదిహేనువందల రూపాయలు చొప్పున తల్లికి ఇవ్వాలని ఆదేశించారు. అయినప్పటికీ ఆ ఆదేశాలను పట్టించుకోకుండా కుమారులు వెళ్లిపోయినట్లు సమాచారం.

దిక్కుతోచని స్థితిలో కుమార్తె వద్దకు వెళ్లిన వెంకమ్మ, ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో నడుము విరిగి మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కుమార్తె కూడా పోషణలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.

తనకు బుక్కెడు అన్నం పెట్టాలని, కొడుకులకు బుద్ధి చెప్పి తగిన న్యాయం చేయాలని వెంకమ్మ స్థానికులు, జిల్లా కలెక్టర్ సహా సంబంధిత అధికారులను వేడుకుంటోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News