Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 09:23 PM

ముగ్గురు కొడుకులున్నా ఆకలితో విలవిలలాడుతున్న వృద్ధ తల్లి

ముగ్గురు కొడుకులున్నా ఆకలితో విలవిలలాడుతున్న వృద్ధ తల్లి

ముగ్గురు కొడుకులున్నా ఆకలితో విలవిలలాడుతున్న వృద్ధ తల్లి
April 03, 2026 07:38 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బుక్కెడు అన్నం కోసం ఎదురుచూస్తున్న 95 ఏళ్ల వెంకమ్మ

కొడుకులకు బుద్ధి చెప్పి ఆదుకోవాలని అధికారులకు వేడుకోలు

సూర్యాపేట: మోతే మండలం నామవరం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ ఓ వృద్ధ తల్లి బుక్కెడు అన్నం కోసం ఎదురుచూస్తూ నిస్సహాయ స్థితిలో జీవిస్తోంది.

గ్రామానికి చెందిన నల్లగంతుల వెంకమ్మ (95) భర్త మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆమెకు పాపయ్య, వెంకన్న, ఎల్లయ్య అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. తండ్రి మరణానంతరం తల్లిని చూసుకుంటామని చెప్పిన కుమారులు, ఆమె పేరుమీద ఉన్న మూడు ఎకరాల తొమ్మిది గుంటల భూమిని తమ పేర్లకు మార్చించుకున్నారు. అనంతరం తల్లిని పట్టించుకోకుండా ఒంటరిగా వదిలేశారు.

ఆకలితో అలమటిస్తున్న వెంకమ్మ స్థానికుల సహాయంతో జిల్లా కేంద్రంలోని ఆదాయ విభాగాధికారిని సంప్రదించింది. స్పందించిన అధికారి ముగ్గురు కుమారులను పిలిపించి ప్రతి ఒక్కరు నెలకు పదిహేనువందల రూపాయలు చొప్పున తల్లికి ఇవ్వాలని ఆదేశించారు. అయినప్పటికీ ఆ ఆదేశాలను పట్టించుకోకుండా కుమారులు వెళ్లిపోయినట్లు సమాచారం.

దిక్కుతోచని స్థితిలో కుమార్తె వద్దకు వెళ్లిన వెంకమ్మ, ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో నడుము విరిగి మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కుమార్తె కూడా పోషణలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.

తనకు బుక్కెడు అన్నం పెట్టాలని, కొడుకులకు బుద్ధి చెప్పి తగిన న్యాయం చేయాలని వెంకమ్మ స్థానికులు, జిల్లా కలెక్టర్ సహా సంబంధిత అధికారులను వేడుకుంటోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News