Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:00 AM

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్
18-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గంగపుత్రుల వ్యాఖ్యలను ఖండించిన దేప శ్యాంసుందర్ ముదిరాజ్

మేనిఫెస్టో హామీ అమలు చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి

ముదిరాజ్ కులస్తులను బీసీ-ఏలో చేర్చవద్దంటూ గంగపుత్ర సంఘం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకులు దేప శ్యాంసుందర్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజులను బీసీ-ఏలో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఓర్వలేక కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.తమకు కావాల్సిన హక్కులను ఎవరైనా కోరవచ్చని, అయితే ఇతర వర్గాల హక్కులను అడ్డుకునే విధంగా ప్రకటనలు చేయడం తగదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు.ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జనాభా గణాంకాల్లో ముదిరాజులే అధిక సంఖ్యలో ఉన్నట్లు తేలిందన్నారు. తాము కొత్తగా ఏమీ కోరడం లేదని, ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను ముదిరాజ్ ఐక్య సంఘాల నాయకులు కలిసి సమస్యను వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. బీసీ-ఏ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో గంగపుత్ర సంఘాలు సమావేశాలు, ప్రెస్‌మీట్లు నిర్వహించడం సరికాదన్నారు.

ముదిరాజుల హక్కుల సాధన కోసం అన్ని ముదిరాజ్ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని, ఇలాంటి ప్రకటనలను సమష్టిగా ఖండించాలని దేప శ్యాంసుందర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో దేప మత్య్సగిరి, గుండ్ల లింగస్వామి, సత్యబోయిన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్

Article Image

గంగపుత్రుల వ్యాఖ్యలను ఖండించిన దేప శ్యాంసుందర్ ముదిరాజ్

మేనిఫెస్టో హామీ అమలు చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి

ముదిరాజ్ కులస్తులను బీసీ-ఏలో చేర్చవద్దంటూ గంగపుత్ర సంఘం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకులు దేప శ్యాంసుందర్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజులను బీసీ-ఏలో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఓర్వలేక కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.తమకు కావాల్సిన హక్కులను ఎవరైనా కోరవచ్చని, అయితే ఇతర వర్గాల హక్కులను అడ్డుకునే విధంగా ప్రకటనలు చేయడం తగదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు.ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జనాభా గణాంకాల్లో ముదిరాజులే అధిక సంఖ్యలో ఉన్నట్లు తేలిందన్నారు. తాము కొత్తగా ఏమీ కోరడం లేదని, ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను ముదిరాజ్ ఐక్య సంఘాల నాయకులు కలిసి సమస్యను వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. బీసీ-ఏ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో గంగపుత్ర సంఘాలు సమావేశాలు, ప్రెస్‌మీట్లు నిర్వహించడం సరికాదన్నారు.

ముదిరాజుల హక్కుల సాధన కోసం అన్ని ముదిరాజ్ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని, ఇలాంటి ప్రకటనలను సమష్టిగా ఖండించాలని దేప శ్యాంసుందర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో దేప మత్య్సగిరి, గుండ్ల లింగస్వామి, సత్యబోయిన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News