Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:45 PM

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్
May 18, 2026 10:02 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గంగపుత్రుల వ్యాఖ్యలను ఖండించిన దేప శ్యాంసుందర్ ముదిరాజ్

మేనిఫెస్టో హామీ అమలు చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి

ముదిరాజ్ కులస్తులను బీసీ-ఏలో చేర్చవద్దంటూ గంగపుత్ర సంఘం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకులు దేప శ్యాంసుందర్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజులను బీసీ-ఏలో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఓర్వలేక కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.తమకు కావాల్సిన హక్కులను ఎవరైనా కోరవచ్చని, అయితే ఇతర వర్గాల హక్కులను అడ్డుకునే విధంగా ప్రకటనలు చేయడం తగదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు.ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జనాభా గణాంకాల్లో ముదిరాజులే అధిక సంఖ్యలో ఉన్నట్లు తేలిందన్నారు. తాము కొత్తగా ఏమీ కోరడం లేదని, ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను ముదిరాజ్ ఐక్య సంఘాల నాయకులు కలిసి సమస్యను వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. బీసీ-ఏ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో గంగపుత్ర సంఘాలు సమావేశాలు, ప్రెస్‌మీట్లు నిర్వహించడం సరికాదన్నారు.

ముదిరాజుల హక్కుల సాధన కోసం అన్ని ముదిరాజ్ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని, ఇలాంటి ప్రకటనలను సమష్టిగా ఖండించాలని దేప శ్యాంసుందర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో దేప మత్య్సగిరి, గుండ్ల లింగస్వామి, సత్యబోయిన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News