ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్
ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలని డిమాండ్
K.RAVI
గంగపుత్రుల వ్యాఖ్యలను ఖండించిన దేప శ్యాంసుందర్ ముదిరాజ్
మేనిఫెస్టో హామీ అమలు చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి
ముదిరాజ్ కులస్తులను బీసీ-ఏలో చేర్చవద్దంటూ గంగపుత్ర సంఘం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకులు దేప శ్యాంసుందర్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజులను బీసీ-ఏలో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఓర్వలేక కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.తమకు కావాల్సిన హక్కులను ఎవరైనా కోరవచ్చని, అయితే ఇతర వర్గాల హక్కులను అడ్డుకునే విధంగా ప్రకటనలు చేయడం తగదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు.ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జనాభా గణాంకాల్లో ముదిరాజులే అధిక సంఖ్యలో ఉన్నట్లు తేలిందన్నారు. తాము కొత్తగా ఏమీ కోరడం లేదని, ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను ముదిరాజ్ ఐక్య సంఘాల నాయకులు కలిసి సమస్యను వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. బీసీ-ఏ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో గంగపుత్ర సంఘాలు సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించడం సరికాదన్నారు.
ముదిరాజుల హక్కుల సాధన కోసం అన్ని ముదిరాజ్ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని, ఇలాంటి ప్రకటనలను సమష్టిగా ఖండించాలని దేప శ్యాంసుందర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో దేప మత్య్సగిరి, గుండ్ల లింగస్వామి, సత్యబోయిన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి