PRINT TIME: April 10, 2026 11:42 AM
ముదిరాజ్లకు హామీలు అమలు చేయాలి
ముదిరాజ్లకు హామీలు అమలు చేయాలి
April 10, 2026 10:12 AM
85 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
గాంధీభవన్ ముట్టడి ముందే ముదిరాజ్ సంఘం నేతల అరెస్టు
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి సభలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ముదిరాజ్లు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పించాలని కోరుతూ గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ క్రమంలో పిల్లలమర్రి ముదిరాజ్ సంఘం సభ్యులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల హామీలను అమలు చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి